YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఈపీఎఫ్ కార్యాలయం లో అర్థరాత్రి వరకు కొనసాగిన సీబీఐ తనిఖీలు ఎట్టకేలకు కేసు నమోదు చేసి భరత్ రెడ్డి ని పట్టుకెళ్లిన సీబీఐ అధికారులు

ఈపీఎఫ్ కార్యాలయం లో అర్థరాత్రి వరకు  కొనసాగిన సీబీఐ  తనిఖీలు ఎట్టకేలకు కేసు నమోదు చేసి భరత్ రెడ్డి ని పట్టుకెళ్లిన సీబీఐ అధికారులు

సంగారెడ్డి జనవరి 19 
పటాన్ చెరు పిఎఫ్ ఆఫీస్ లో ఒక ఉద్యోగి లంచం డిమాండ్ చేశారనే ఆరోపణలపై సిబిఐ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో  లో ఉద్యోగి 3వేల రూపాయలు లంచం తీసుకున్నట్టుగా తేలింది. సదరు ఉద్యోగి ని తనిఖీలు చేయగా అతని వద్ద డబ్బు మాత్రం కనిపించలేదని సమాచారం . ఆ తర్వాత ఆ డబ్బుల కోసం అధికారులు ప్రత్యేకంగా వేతకాల్సి వచ్చింది. చివరకు తనిఖీలో డబ్బులు కూడా లభించడంతో భరత్ రెడ్డి పై కేసు నమోదు చేశారు. ఈ మేరకు అతను ప్రాథమికంగా లంచం ఆడిగినట్టు ఫిర్యాదు ఇవ్వడంతో సీబీఐ అధికారులు దాడి చేశారు. పంచనామా నిర్వహించి రాత్రి 1:00 సమయంలో అతన్ని అదుపులోకి తీసుకుని వెళుతూ మీడియా సమాచారం అడుగగా సమాధానం దటవేసిన అధికారులు  కేసు నమోదు చేసుకొని తమ కార్యాలయానికి తరలించారు. అరెస్ట్ కు సంబంధించి పూర్తి వివరాలను సీబీఐ కార్యలయం నుంచి మీడియా కు సమాచారం ఇస్తామని ఒక అధికారి వివరణ ఇచ్చారు. వారి పేర్లను చెప్పడానికి కూడా వారు నిరాకరించారు.

Related Posts