శంషాబాద్ జనవరి 20
రంగారెడ్డి జిల్ల శంషాబాద్ ప్రాంతంలో తిరుగాడుతున్నది చిరుత కాదు చిరుతలు ఒకటి కదు రెండు అయి ఉండవచ్చని అటవిశాఖ ఆధికారులు అనుమానిస్తున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కనిపించిన చిరుత ఎయిర్ పోర్ట్ లో నుండి బయటకు వెళ్లినట్లు ఆనవాళ్లు కనిపించలేదు అంటున్నారు. ఎయిర్ పోర్ట్ టర్మినల్ వద్ద చిరుత ఆచూకి లభించినట్టు వ్యక్తి ఫోన్ లో తీసిన వీడియాను అధికారులు పరిశీలించారు. అయితే, ఫో లో చిరుత ఉన్నట్లు సరిగ్గా కనిపించడం లేదంటున్నారు. మామిడిపల్లి వద్ద కనిపించిన చిరుత నిజమే అయితే అది ఇది రెండవ చిరుత ఐ ఉండవచ్చని అధికారుల వెల్లడించారు. ఇటు ఎయిర్ పోర్ట్ లో, అటు మామిడిపల్లి శివారులో స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. స్థానికులు మాత్రం చిరుత ఎటునుంచి వచ్చి దాడి చేస్తుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భయం గుప్పిట్లో ఉంటున్నారు. చిరుతను త్వరగా బంధించి తమ ప్రాణాలను కాపాడాలని స్థానికులు అయితే వేడుకుంటున్నారు