YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సీఎస్ తో సైనికాధికారి భేటీ

సీఎస్ తో సైనికాధికారి భేటీ

అమరావతి జనవరి 21 
ఆంధ్రా సబ్ ఏరియా డిప్యూటీ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ బ్రిగేడియర్ అభిజిత్ చంద్ర అమరావతి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్ దాస్ తో భేటీ అయ్యారు.ఈసందర్భంగా బ్రిగేడియర్ అభిజిత్ చంద్ర మాట్లాడుతూ ఎక్స్ సర్వీస్ మెన్ ఆసుపత్రి (పాలిక్లినిక్)నిర్మాణానికి కృష్ణా జిల్లాలో ముఖ్యంగా విజయవాడ సమీపంలో మచిలీపట్నం జాతీయ రహదారి మార్గంలో స్థలం కేటాయించాలని సిఎస్ కు విజ్ణప్తి చేశారు.అలాగే సైనిక్ ఆరామ్ అతిధిగృహ నిర్మాణానికి కూడా తగిన స్థలం కేటాయించాలని విజ్ణప్తి చేశారు.అంతేగాక ఈపాలిక్లినిక్ ఆసుపత్రి నిర్మాణాన్ని ప్రభుత్వ ఏజెన్సీ ద్వారా నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని సిఎస్ కు ఆయన విజ్ణప్తి చేశారు.ఎక్స్ సర్వీస్ మెన్ ఆసుపత్రి కరెంట్ బిల్లుల విషయాన్ని కూడా బ్రిగేడియర్ అభిజిత్ చంద్ర సిఎస్ దృష్టికి తెచ్చారు.అదే విధంగా గుంటూరు జిల్లా నరసరావుపేట వద్ద ఆర్మడ్ ఫోర్సెస్ కు చెందిన నాగిరెడ్డి, గోవిందరెడ్డిలకు సంబంధించిన ఇళ్ళకు నష్టం కలిగించిన వారిపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సిఎస్ దృష్టికి తెచ్చారు.ఈసందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ మాట్లాడుతూ ఎక్స్ సర్వీస్ మెన్ ఆసుపత్రి నిర్మాణ పనులను పోలీస్ హౌసింగ్ నిర్మాణ సంస్థ ద్వారా చేపట్టే విధంగా అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.ఇందుకు సంబందించి వెంటనే తగిన ప్రతిపాదనలను ఇవ్వాలని బ్రిగేడియర్ అభిజిత్ చంద్రకు సిఎస్ సూచించారు.నరస రావుపేట వద్ద ఆర్మడ్ ఫోర్సెస్ కు చెందిన సిబ్బంది ఇళ్లకు నష్టం కలిగించిన వారిపై వెంటనే తగు చర్యలు తీసుకోవాల్సిందిగా  జిల్లా కలక్టర్ కు ఆదేశాలు జారీ చేస్తానని చెప్పారు.ఆంధ్రా సబ్ ఏరియా ప్రాంతంలో మాజీ సైనికుల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలను సిఎస్ ఆదిత్యానాద్ దాస్ బ్రిగేడియర్ అభిజిత్ చంద్రను అడిగి తెల్సుకున్నా రు.అనంతరం ఆంధ్రా సబ్ ఏరియా తరుపున సిఎస్ ఆదిత్యానాధ్ దాస్ కు,ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి అభిజిత్ చంద్ర జ్ణాపికలను అందించారు.

Related Posts