విశాఖపట్నం ఫిబ్రవరి 5,
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యం లో వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. నన్ను కూడా చంపండి అంటూ చంద్రబాబు వీధి నాటకం మొదలుపెట్టారని ఎద్దేవా చేశారు.రాజకీయంగా ఎప్పుడో చచ్చిన పామును మళ్లీ చంపాల్సిన అవసరం ఎవరికుంటుందని విజయసాయి ప్రశ్నించారు. మొన్నటి ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్టపోయిందని, అయినా ఏదో విధంగా ప్రజల సానుభూతితో లబ్ది పొందాలని లేచి బుసలు కొడుతున్నారని విమర్శించారు. ఇటీవల కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పై దాడి, అచ్చెన్నాయుడి అరెస్ట్ సందర్భంగా చంద్రబాబు అధికార వైసీపీ పై నిప్పులు చెరిగారు. ఆ సమయంలో చేసిన వ్యాఖ్యలపైనే విజయసాయి స్పందించినట్టు తెలు స్తోంది.హైకోర్టు తరలింపు విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉంది. న్యాయస్థానం తీర్పు మీద ఆధారపడి ఉంటుందని చెప్పారు. పంచా యతీ ఎన్నికల ప్రక్రియ ముగియగానే ఫిబ్రవరి 22 తర్వాత ఏ క్షణమైనా కార్పొరేషన్ మునిసిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం వున్నందున ఇప్పటి నుంచే అప్రమత్తం కావాలని నాయకులకు విజయసా యిరెడ్డి ఉద్బోధించారు.అదేవిధంగా పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకునే విదంగా కృషి చెయ్యాలని సూచించారు.