YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

సాగర్ లో సీఎం కేసీఆర్

సాగర్ లో సీఎం కేసీఆర్

సాగర్ లో సీఎం కేసీఆర్
నల్లగొండ ఫిబ్రవరి 10  
నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పర్యటించారు.  ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో నాగార్జునసాగర్ చివరి భూములతో పాటు ఎగువన ఉన్న ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు 12 ఎత్తిపోతల పథకాలకు రూ.3వేల కోట్ల నిధులు మంజూరు చేస్తూ సీఎం ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. వీటికి కొద్ది సేపటి క్రితం ముఖ్యమంత్రి శంఖుస్థాపన చేశారు. సాగర్ వద్ద ఉన్న నెళ్లికల్ వద్ద ఒకేసారి 12 ఎత్తిపోతలు,ఇతర అభివృద్ధి పనులకు సంబంధించి శంఖుస్థాపన లు చేశారు. వీటి ద్వారా జిల్లాలో 55వేల ఎకరాలకు అదనంగా సాగునీరు అందనుంది.  ఆ తరువాత సాగర్ లోని హిల్ కాలనీలోని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నివాసంలో భోజనం చేసారు. తరువాత హాలియా-పాలెం వద్ద ఏర్పాటు చేసిన రైతు ధన్యవాద సభలో పాల్గోనడానికి బయలుదేరారు. 

Related Posts