సాగర్ లో సీఎం కేసీఆర్
నల్లగొండ ఫిబ్రవరి 10
నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పర్యటించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో నాగార్జునసాగర్ చివరి భూములతో పాటు ఎగువన ఉన్న ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు 12 ఎత్తిపోతల పథకాలకు రూ.3వేల కోట్ల నిధులు మంజూరు చేస్తూ సీఎం ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. వీటికి కొద్ది సేపటి క్రితం ముఖ్యమంత్రి శంఖుస్థాపన చేశారు. సాగర్ వద్ద ఉన్న నెళ్లికల్ వద్ద ఒకేసారి 12 ఎత్తిపోతలు,ఇతర అభివృద్ధి పనులకు సంబంధించి శంఖుస్థాపన లు చేశారు. వీటి ద్వారా జిల్లాలో 55వేల ఎకరాలకు అదనంగా సాగునీరు అందనుంది. ఆ తరువాత సాగర్ లోని హిల్ కాలనీలోని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నివాసంలో భోజనం చేసారు. తరువాత హాలియా-పాలెం వద్ద ఏర్పాటు చేసిన రైతు ధన్యవాద సభలో పాల్గోనడానికి బయలుదేరారు.