YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

ఇంట్లో వాళ్ళకే జగన్ వెన్నుపోటు పొడిచారు: చంద్రబాబు

ఇంట్లో వాళ్ళకే జగన్ వెన్నుపోటు పొడిచారు: చంద్రబాబు

ఇంట్లో వాళ్ళకే జగన్ వెన్నుపోటు పొడిచారు: చంద్రబాబు
అమరావతి ఫిబ్రవరి 10 
 వైఎస్ షర్మిల పార్టీ ఏర్పాటు చేస్తున్నారన్న వార్తలపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. పార్టీ పెడుతున్నానని షర్మిల చెబుతుంటే.. ఏ2 మాత్రం లేదంటున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మీడియాతో బుధవారం మాట్లాడుతూ..ఇంట్లో వాళ్ళకే జగన్ వెన్నుపోటు పొడిచారని ఎద్దేవా చేశారు. బాబాయ్ హత్య ఇంకా తేల్చ లేదని విమర్శించారు. విజయసాయి రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన ఓ వీడియో ప్లే చేశారు. ఆనాడు జగనన్న వదిలిన బాణం విశ్వసనీయత ఏమైందన్నారు. విశ్వసనీయత గురించి మాట్లాడే జగన్.. షర్మిల పార్టీ పెట్టడంపై స్పందించాలన్నారు. అప్పుడు సీబీఐ కావాలని డిమాండ్ చేసిన జగన్.. ఇప్పుడు వద్దు అంటున్నారన్నారు. బాబాయ్‌ని చంపిన వారితో కలిసిన వ్యక్తి జగన్ అని ఆరోపించారు. నాడు వివేకా కూతురు... నేడు షర్మిల పోరాడుతున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు

Related Posts