సీఎం జన్మదిన సందర్బంగా లబ్దిదారులు
సైతం మొక్కలు నాటాలి
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పిలుపు
జగిత్యాల ఫిబ్రవరి 10
జగిత్యాల పట్టణంలోని పలు వార్డులకు చెందిన 46 మంది లబ్దిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన 12,73,500 లక్షల విలువగల చెక్కులను జిల్లా కేంద్రంలోని
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చేతులమీదుగా లబ్ధిదారులకు
అందజేశారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం వైద్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వ వైద్యశాలల్లో సకల సౌకర్యాలు కల్పించుకుంటున్నామని, జగిత్యాల ఏరియా వైద్యశాలలో డయాలసిస్ కేంద్రం సైతం ఉందని, మాతా శిశు సంరక్షణ కేంద్రం సైతం త్వరలో ప్రారంభించుకోబోతున్నామని అన్నారు. కరోనా కారణంగా కాస్త ఆర్దికంగా వెనకబడ్డప్పటికి తెలంగాణలో సంక్షేమ పధకాలు ఆగలేదని అన్నారు. ఈనెల 17 న ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్బంగా జగిత్యాల నియోజకవర్గంలో లక్ష మొక్కలు నాటనున్నామని, సీఎం సహాయనిధి చెక్కులు పొందిన లబ్దిదారులు సైతం ఇండ్ల వద్ద మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భోగ శ్రావణి, కౌన్సిలర్లు పంబాల రాము,వల్లెపు రేణుక మోగిలి, కూతురు రాజేష్, బండారు రజని నరేందర్, మల్లికార్జున్, కుసరి అనిల్, ఒద్ది శ్రీలత రామ్మోహన్, నర్సమ్మ, గంగసాగర్, మల్లవ్వ తిరుమలయ్య ,కోరే గంగమల్లు, తిరుపతమ్మ కోటేశ్వరరావు, కో- ఆప్షన్ సభ్యులు రియాజ్ మామా, పట్టణ పార్టీ ఉపాధ్యక్షుడు ఆనంద్ రావు,వొళ్ళెం మల్లేశం, ఏ యం సి డైరెక్టర్ బండారి విజయ్, నాయకులు అరుముళ్ల పవన్, జితేందర్, అహమ్మద్,గౌస్, కూతురు శేఖర్, చిరంజీవి,రాజయ్య తదితరులు ఉన్నారు.