YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

ఏప్రిల్ 10న పార్టీని ప్రకటించనున్న షర్మిల!?

ఏప్రిల్ 10న పార్టీని ప్రకటించనున్న షర్మిల!?

హైదరాబాద్ ఫిబ్రవరి 11
వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురుగా రాజకీయాల్లోకి వస్తున్న వైఎస్ షర్మిల తన రాజకీయ అడుగులు వేగంగా వేయడానికి రెడీ అవుతున్నారు. ఏప్రిల్ 10న షర్మిల తన పార్టీని ప్రకటించనున్నట్లు సమాచారం.ఇటీవల హైదరాబాద్ లో మీటింగ్ నిర్వహించిన షర్మిల ఇక అన్ని జిల్లాల్లోనూ వైఎస్ఆర్ అభిమానులను కలిసేందుకు రెడీ అయ్యారు. ఈ క్రమంలోనే పార్టీ ప్రకటన తేదిని.. స్థలాన్ని ఖరారు చేసినట్లు సమాచారం. ఇక ప్రజలకు చేరువ కావడానికి చేవెళ్ల నుంచి షర్మిల పాదయాత్రను ప్రారంభిస్తారన్న చర్చ కూడా సాగుతోంది. ఏప్రిల్ మొదటి వారం కల్లా ఉమ్మడి జిల్లాల్లో కార్యకర్తలు నేతలను ఆమె కలువనున్నాయి 2003లో ఇదే రోజున దివంగత వైఎస్ఆర్ చేవెళ్లలో ప్రతిష్టాత్మక పాదయాత్రను ఇదే రోజు ప్రారంభించారు. 2004లో కాంగ్రెస్ ను అధికారంలోకి తేవడానికి అదే బాటలు వేసింది.దీంతో అదే రోజు.. పార్టీని ప్రారంభించాలని.. చేవేళ్లలోనే ప్రారంభించాలని యోచిస్తున్నట్టు సమాచారం.ఇప్పటికే నల్లగొండ నేతలతో షర్మిల ఆత్మీయ సమ్మేళనం ముగిసింది. హైదరాబాద్కు దగ్గరగా ఉన్న ఉమ్మడి జిల్లాల ఆత్మీయ సమ్మేళనాలు  నిర్వహించాలని షర్మిల భావిస్తున్నారు. దూరంగా ఉన్న జిల్లాలకు మాత్రం స్వయంగా వెళ్లి నిర్వహించాలని ఆమె సూత్రప్రాయంగా నిర్ణయించారు.
ఈ నెల 21న ఖమ్మం లేదా ఆదిలాబాద్ జిల్లాలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు. ఫిబ్రవరి ఆఖరులో హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి మహబూబ్నగర్లో ఒక జిల్లా సమావేశం ఉంటుందని తెలిసింది. అటు నగరంలో జరిగే ఆత్మీయ సమ్మేళనాలను లోటస్ పాండ్లో కాకుండే వేరొక చోట నిర్వహించాలని యోచిస్తున్నారు.

Related Posts