హైదరాబాద్ ఫిబ్రవరి 11
అందరూ ఉహించినట్లే గ్రేటర్ హైదరాబాద్ మేయర్గా టీఆర్ఎస్ కీలక నేత కేకే కుమార్తె గద్వాల విజయలక్ష్మి ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్గా తార్నాక కార్పొరేటర్ మోతే శ్రీలత రెడ్డి ఎన్నికయ్యారు. గురువారం జీహెచ్ఎంసీ కార్యాలయంలో జరిగిన మేయర్ ఎన్నికలో టీఆర్ఎస్కు ఎంఐఎం మద్దతు ఇచ్చింది. అధికార పక్షం టీఆర్ఎస్ అధిష్టానం ఇచ్చిన ఆదేశాల మేరకు షీల్డు కవర్ తెరిచి మేయర్గా విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్గా శ్రీలత రెడ్డి పేర్లను అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా పలువురు తెరాస నేతలు, కార్యకర్తలు, అభిమానులు, అనుచరులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. గద్వాల విజయలక్ష్మి బంజారాహిల్స్ నుంచి రెండోసారి కార్పొరేటర్గా గెలిచారు.