YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

తెలంగాణ

రంగాపురం దర్గా స్థలము వివాదం - దీక్షలు చేపట్టిన దర్గా నిర్వాహకులు

రంగాపురం దర్గా స్థలము వివాదం - దీక్షలు చేపట్టిన దర్గా నిర్వాహకులు

మాప్రతినిది మండల పరిధిలోని ఆర్ఎస్ రంగాపురం గ్రామం లో ఉన్న అల్లా బకాష్ మియా దర్గా ముందర ఉన్న స్థల వివాదం గత 30 రోజుల నుండి చోటు చేసుకుందని, దర్గా నిర్వాహకులు గురువారం అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దర్గా ముందు ఉన్న స్థలంలో గత 80 సంవత్సరాల నుండి కిస్తీ నిర్వహించే వారమన్నారు. కానీ ఇప్పుడు స్థానిక గ్రామానికి చెందిన సిరుప రామేశ్వర్ రెడ్డి, సిరుప లక్ష్మీదేవి లు ఆ స్థలం మాది,దానికి సంబంధించిన ఆధారాలు మా వద్ద ఉన్నాయని వారు ఆరోపిస్తున్నారన్నారు. ఆ స్థలంలో ఉన్న కిస్తీ ని వారు రాత్రివేళలో ఎవరూ లేని సమయంలో వాటిని ధ్వంసం చేస్తున్నారన్నారు. గతంలో ప్రతి సంవత్సరము జనవరి నెల 29, 30,31 తేదీల్లో ఉరుసు జరిపే వారమని , వారు అడ్డగించడం తో ఊరుసు ను వాయిదాలు వేస్తున్నామని అన్నారు. దర్గా ముందు ఉన్న స్థలం మాది అని నిర్వాహకులు బాయాకాటి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సయ్యద్ గౌస్ పీరా, సయ్యద్ హిదాయత్, మహబూబ్ మియా లు దీక్ష చేపట్టామన్నారు.సీఐ కేశవ రెడ్డి చొరవతో దీక్షను విరమింపజేశామన్నారు.

Related Posts