YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

తెలంగాణ

ఘనంగా దీన్ దయాళ్ బలిదాన దివాస్

ఘనంగా దీన్ దయాళ్ బలిదాన దివాస్

కోరుట్ల పట్టణంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో గురువారం దీన్ దయాళ్ బలిదాన దివాస్ ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిలుగా బీజేపీ జిల్లా అధ్యక్షులు మొరపెల్లి సత్యనారాయణ రావు, ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘ్ కార్య నిర్వాహక్ కరీంనగర్ గోనె భూమయ్య హజరై పట్టణంలోని మాదాపూర్ ఎక్స్ రోడ్డు లోని దీన్ దయాల్ ఉపాధ్యాయ విగ్రహానికి  పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దీన్ దయాల్ సూచించిన అంత్యోదయ విధానాన్ని ఏకాత్మ మానవతావాదాన్ని ప్రతి చేనుకు నీరాందాలి ప్రతి చేతికి పని ఉండాలి ఇలాంటి మూల సిద్ధాంతాలను ప్రవేశపెట్టిన మహనీయులు వారికి మనం నిజమైన నివాళులర్పించాలంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రతి గ్రామానికి వెళ్లి ప్రతి పేదవారికి అందే విధంగా మనం కృషి చేసినప్పుడే వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇంచార్జ్ జంగిలి వెంకటి, జిల్లా మాజీ అధ్యక్షులు బాజోజీ భాస్కర్ , జిల్లా కిసాన్మోర్చా అధ్యక్షులు కోడిపెల్లి గోపాల్ రెడ్డి,జిల్లా సీనియర్ నాయకులు ఇందూరి సత్యం, సుధవేని మహేష్, పిసరి నర్సయ్య శీలం వేణుగోపాల్, మహేష్, కైరంకొండ రాజేశం, మాడవేణి నరేష్, సుఖేందర్ గౌడ్ , ఇల్లెందుల శ్రీనివాస్, ఇందూరి తిరుమల వాసు,సాగిడే మహేష్ ,వాజీద్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts