నిర్మల్
నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్ లో రైతు వేదిక ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. గ్రామానికి వచ్చిన మంత్రి, అధికారులు, ప్రజాప్రతినిధులను గ్రామస్థులు అడ్డుకొని వ్యతిరేక నినాదాలు చేశారు. సదర్ మార్ట్ బ్యారేజ్ లో భూములు కోల్పోయిన రైతులకు ఇప్పటి వరకు పరిహారం చెల్లించలేదని భాదిత రైతులు మండిపడ్డారు. వెంటనే తమకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్. కాగా ఈరోజు మంత్రి తమ గ్రామానికి వస్తున్నాడని తెలుసుకొని.. మంత్రిని రనివ్వబోమని హెచ్చరించారు అన్నదాతలు. కాగా పెద్దఎత్తున మోహరించిన పోలీసులు రైతులను కట్టడి చేయగా.. ప్రభుత్వానికి, మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.