YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఉప ఎన్నికల్లో పోటీకి టీటీడీపీ

ఉప ఎన్నికల్లో పోటీకి టీటీడీపీ

హైదరాబాద్, ఫిబ్రవరి 15, వచ్చే నెలలో జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు ఎల్‌.రమణ సిద్ధమవుతున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను చేసుకుంటున్నారు. పార్టీ గుర్తుపై కాకుండా అభ్యర్థి పేరుతో జరిగే ఎన్నికలు కావడంతో ఖచ్చితంగా కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయన భావిస్తున్నారు.హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల స్థానం నుంచి ఎల్‌.రమణ పోటీచేయనున్నారు. పలు బీసీ సంఘాలు కూడా రమణను బలపరుస్తున్నట్టు టీడీపీ నేతలు చెబుతున్నారు. దీనికి తోడు ఓటర్ల నమోదులో టీఆర్‌ఎస్‌, బీజేపీ కంటే కూడా టీడీపీనే ముందున్నదని.. ఎన్నికల్లో కూడా వారు తమకు మద్దతు ఇస్తారని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటికే కొత్త పార్టీలు వస్తాయన్న వార్తలు జోరందుకున్నాయి. మరోవైపు రాష్ట్రంలో మరో ఉప ఎన్నికకు రంగం సిద్దం అవుతోంది. త్వరలో నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక జరగనుంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ సాగర్ పైనే దృష్టి పెట్టాయి. అభ్యర్థులను అధికారకంగా ప్రకటించకపోయినప్పటికీ.. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక కూడా దాదాపు అన్ని పార్టీల్లో జరిగిపోయినట్లుగా తెలుస్తోంది. బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ సాగర్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా మరో పార్టీ కూడా సాగర్ బరిలోకి దిగేందుకు రెడీ అవుతోంది.సాగర్ ఉప ఎన్నికలో పోటీ చేయాలని టీటీడీపీ నిర్ణయించింది. మువ్వా అరుణ్‌కుమార్‌ను అభ్యర్థిగా ఆ పార్టీ ప్రకటించింది. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. నియోజకవర్గంలోని అనుముల మండలం చింతగూడెం గ్రామానికి చెందిన అరుణ్‌కుమార్‌ గతంలో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా, టీడీపీ లీగల్‌ సెల్‌ రాష్ట్ర నాయకుడిగా పనిచేశారు. ప్రస్తుతం నాగార్జునసాగర్‌ అసెంబ్లీ పార్టీ ఇన్‌చార్జిగా ఉన్నారు. రంగారెడ్డి –హైదరాబాద్‌–మహబూబ్‌నగర్‌ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎల్‌.రమణ బరిలో ఉంటారనే ప్రచారం జరుగుతోంది.హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల స్థానం నుంచి ఎల్‌.రమణ పోటీచేయనున్నారు. పలు బీసీ సంఘాలు కూడా రమణను బలపరుస్తున్నట్టు టీడీపీ నేతలు చెబుతున్నారు. దీనికి తోడు ఓటర్ల నమోదులో టీఆర్‌ఎస్‌, బీజేపీ కంటే కూడా టీడీపీనే ముందున్నదని.. ఎన్నికల్లో కూడా వారు తమకు మద్దతు ఇస్తారని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఉమ్మడి ఎపీలో ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రిగా కూడా పనిచేశారు ఎల్. రమణ. తెలంగాణ వచ్చాక మాత్రం ఏ చట్టసభలోకి అడుగు పెట్టే అవకాశం రాలేదు. 2014లో జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓటమిపాలు కాగా, 2018 ఎన్నికల్లో అప్పటి పొత్తుల్లో భాగంగా పోటీ చేయలేదు. ఇప్పుడు హైదరాబాద్‌- రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీగా అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు రమణ.

Related Posts