YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కామారెడ్డి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం

కామారెడ్డి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం

కామారెడ్డి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం 
కామారెడ్డి  ఫిబ్రవరి 26
కామారెడ్డి లో మంథనిలో హైకోర్టు న్యాయవాద దంపతులు వమనరావు, నాగమణి ల హత్య కు నిరసనగా శుక్రవారం రోజు కామారెడ్డి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్బంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ న్యాయవాద దంపతుల హత్య పై సీబీఐ ఎంక్వైరీ చేపట్టాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఏర్పాటు చేయాలని, వారి కుటుంబానికి ఐదు కోట్ల నష్ట పరిహారం చెల్లించాలని, హత్య తో సంబంధo ఉన్న అసలు సూత్రదారులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయవాదుల పై జరుగుతున్న దాడులను అరికట్టాలని, అడ్వొకేట్ ప్రోటాక్షన్ యాక్ట్ తీసుకురావాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమలో బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మన్ రావు, సురేందర్ రెడ్డి, ఉపాద్యక్షుడు అతిమాముల శ్రీధర్ ప్రతినిధులు నర్సింహారెడ్డి, జగన్నాథం, శంకర్ రెడ్డి, వెంకట్రాంరెడ్డి, చంద్రశేఖర్, దామోదర్ రెడీ,మహబూబ్ అలీ, దేవరాజ్ గౌడ్, అమృత్ రావు, చింతల గోపి, గోవింద్ రావు, భిక్షపతి, శ్రీకాంత్ గౌడ్, బి.నారాయణ, గంగాధర్, జి.శ్రీనివాస్, కె.శ్రీనివాస్, మాక్సుద్, మోహన్ రెడ్డి, గంగరాజ్, స్టీఫెన్ రాజ్, అంగ్ రాజ్, రజినీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts