అమరావతి సమస్యకు పరిష్కారం చూపాలి
విజయవాడ ఫిబ్రవరి 27,
అమరావతి రైతుల ఉద్యమం చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగినదని అమరావతి మహిళా జేఏసీ నేత, ఏపీ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు సుంకర పద్మశ్రీ అన్నారు. రాజధాని రైతుల ఉద్యమంపై ఏపీ ప్రభుత్వం అవలంభిస్తున్న వైఖరి దారుణం. ఢిల్లీలో రైతుల ఆందోళనలపై కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమించి పలు దఫాలుగా రైతులతో చర్చించారు. మరి ఏపీలో ఒక్కసారైనా ముఖ్యమంత్రి జగన్ రైతులతో మాట్లాడారా అని ఆమె ప్రశ్నించారు. రాజధాని కోసం ఒకవైపు అన్నదాతలు తనువు చాలిస్తున్నారు. అమరావతే రాజధానిగా కొనసాగాలని రైతులు, మహిళలు 440 రోజుల తరబడి పోరాటం చేస్తున్నారు. అమరావతి రాజధాని సమస్యకు ప్రభుత్వం ఒక పరిష్కారం చూపాలి. రైతులతో సంప్రదింపులు జరిపేందుకు ప్రభుత్వం ఒక కమిటీని నియమించాలి. ఈ కమిటీలో సిట్టింగ్ జడ్జి, ఐఏఎస్ అధికారులతో పాటు రైతులంటే గౌరవం ఉన్న రాష్ట్ర మంత్రి సభ్యులుగా ఉండాలి. అన్నదాత కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదన్న సంగతి జగన్ గుర్తు పెట్టుకోవాలని అన్నారు.