YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆరోగ్యం

ఏసీ 24 కంటిన్యూ చేయడం మంచిది

ఏసీ 24 కంటిన్యూ చేయడం మంచిది
మీ ఇంట్లో ఏసీ ఉందా? ఎక్కువ చలి లేకుండా 24°c నుంచి 28°c ఉష్ణోగ్రతలకు ఏసీ టెంపరేచర్ సెట్ చేస్తున్నారా? అయితే, జాగ్రత్త! అలా చేస్తే ఈ ముప్పు కొనితెచ్చుకున్నట్లే. దీనిపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ లోని డీసీటీ-ఐసీఎంఆర్‌లోని సీనియర్ కన్సాల్టెంట్ డాక్టర్ రమేష్ సి.ధిమన్ ఏం చెప్పారో చూడండి. మీ ఇంట్లో దోమలు ఎక్కువగా ఉంటున్నట్లయితే తప్పకుండా ఏసీ ఉష్ణోగ్రతల విషయంలో జాగ్రత్తలు పాటించాలని డాక్టర్ రమేష్ తెలుపుతున్నారు. లేకపోతే డెంగ్యూ కారక దోమలు వృద్ధి చెందే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యంగా ఏసీని 24°c నుంచి 28°c మధ్య ఉష్ణోగ్రతల్లో దోమలు బతుకుతాయని, ఆ ఉష్ణోగ్రతల్లో అవి క్రమేనా ఏడెస్ దోమలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఏసీల వల్ల ఇంట్లోనే డెంగ్యూ దోమలు పెరిగే ప్రమాదం ఉందని తెలిపారు. ఇటీవల డెంగ్యూ, చికున్‌గున్యా వంటి రోగాలు చలికాలం, ఎండకాలంలో కూడా ఉనికిని చాటుతున్నాయని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ఏసీలు ఉపయోగించేవారు 24°c కంటే తక్కువ ఉష్ణోగ్రతలను ఉపయోగించడమే ఉత్తమం అని సూచించారు

Related Posts