YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

కబ్జాదారుల నుంచి భూమిని కాపాడి న్యాయం చేయాలి

కబ్జాదారుల నుంచి భూమిని కాపాడి న్యాయం చేయాలి

హైదరాబాద్ మార్చ్ 18 బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3 లో ఉన్న తమ 24 ఏకరాల 10 గుంటల భూమిని  సుల్తాన్ సొసైటీ సభ్యులు  కబ్జా చేశారని మీర్ ఉస్మాన్ అలీఖాన్ మునిమనవ రాలుషఫియాసకినాఆరోపించారు.బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె  మాట్లాడుతూ.... తమ వారసత్వ సంపదను కబ్జా దారుల నుండి కాపాడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మోజంజా ట్రస్ట్ డీడ్ 1940 ప్రకారం వారసులకు అంద వలసిన ప్రాపర్టీని తనకు  ఇవ్వకుండా మోసం చేశారన్నారు. సుల్తాన్ ఉల్లం సొసైటీ సంస్థలు ఆక్రమించిన తమ ఆస్తి నుండి తన వాటాను తనకు ఇప్పించాలని ప్రభుత్వాన్నివేడుకున్నారు .ఈవిషయంపై పంజగుట్ట పోలీస్ స్టేషన్ లొ గత ఏడాది క్రితం కేసు నమోదు చేసినప్పటి కి వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అన్యాయం అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.  తక్షణమే కబ్జాకు పాలుపడ్డ వారిపై  చట్టపరమైన చర్యలు  తీసుకొని ఎలాంటి ఆధారం లేని తనను ఆదుకొని న్యాయం చేయాలన్నారు.

Related Posts