YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

ప్రమాదంపై మంత్రి ఎర్రబెల్లి స్పందన మృతుల కుటుంబాలకు సానుభూతి 

ప్రమాదంపై మంత్రి ఎర్రబెల్లి స్పందన మృతుల కుటుంబాలకు సానుభూతి 

ప్రమాదంపై మంత్రి ఎర్రబెల్లి స్పందన
మృతుల కుటుంబాలకు సానుభూతి 
వరంగల్ మార్చి 19, 
వరంగల్  రూరల్ జిల్లా  ఆత్మకూరు మండలం లోని నీరుకుల్ల  క్రాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో  ముగ్గురు వ్యవసాయ కూలీలు మృతి చెందిన ఘటనపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు.  మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు.  ఘటన జరిగిన సమయంలో  ఆటోలో డ్రైవర్ సహా మొత్తం 21 మంది వ్యవసాయ కూలీలు ఉన్నారు.  వీరంతా ఆత్మకూరు మండల కేంద్రం నుంచి నల్లబెల్లి మండలంలోని రంగాపురం గ్రామానికి మిర్చి కోసేందుకు ఆటోలో బయలుదేరారు.  మార్గమధ్యంలో నీరుకుల్ల క్రాస్ వద్ద ప్రమాదం జరిగింది.  ఆటోలో ఉన్న మహిళలు మాడిశెట్టి సాంబలక్ష్మి (65), పాలకుర్తి సరోజన (55), మెహబూబీ (50) అక్కడికక్కడే మృతి చెందారు.  మరో ఏడుగురు గాయపడ్డారు  వీరందరిదీ ఆత్మకూరు మండల కేంద్రం.  మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం పోలీసులు వరంగల్ ఆసుపత్రికి తరలించారు.

Related Posts