YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

కరడు గట్టిన క్రిమినల్ ఆరెస్టు

కరడు గట్టిన క్రిమినల్ ఆరెస్టు

కరడు గట్టిన క్రిమినల్ ఆరెస్టు
శంషాబాద్ మార్చ్ 22
నోటోరియస్ క్రిమినల్ గౌస్ పాషా అలియాస్ మహమ్మద్ గౌస్ అలియాస్ ఖూనీ గౌస్ ను శంషాబాద్ ఎస్ఓటి, రాజేంద్రనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ జోన్ డిసిపి ఎన్. ప్రకాష్ రెడ్డి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితుడు సంబంధించిన వివరాలను వెల్లడించారు. రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధి తో పాటు నగరంలోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిందితుడు గౌస్ పై కేసులు నమోదై ఉన్నాయి.  గౌస్ బాష నుండి 25 లక్షల రూపాయల విలువచేసే 50 తులాల బంగారు ఆభరణాలు ఒక కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు గౌస్ తన మోటార్ సైకిల్ పై కాలనీలలో సంచరిస్తూ తాళం వేసిన ఇళ్లు టార్గెట్ చేస్తాడు. ఎప్పుడు తన వద్ద ఉంచుకునే ఇనుప రాడ్, కటింగ్ ప్లేయర్, స్క్రూ డ్రైవర్ తో తలుపులు తెరిచి ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఇంటిలో ఉన్న విలువైన బంగారు ఆభరణాలు, నగదును మాత్రమే తీసుకొని ఉడాయిస్తాడు. ఇటీవల రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డైరీ ఫామ్ సులేమాన్ నగర్ కాలనీలలో రాత్రి వేళల్లో వీరంగం సృష్టించిన ఖోని గౌస్ పై కేసులు నమోదు చేసారు. 
అర్ధరాత్రి ఖోని గౌస్ అతని అనుచరులు తల్వార్లతో సులేమాన్ నగర్ లోని పలు ఇండ్ల పై దాడి చేసి భయభ్రాంతులకు గురి చేసి పలు వాహనాలను గౌస్ ద్వంసం చేసాడు. శంషాబాద్ ఎస్ఓటి, రాజేంద్రనగర్ పోలీసులు సంయుక్తంగా నాలుగు బృందాలుగా ఏర్పాడి ఎట్టకేలకు ఖోని గౌస్ ను అరెస్టు చేశారు.నిందితుడు గౌస్ పై రౌడీషీట్ తెరవడం తోపాటు పిడి యాక్ట్ ను అమలు చేయనున్నట్టు డిసిపి ప్రకాష్ రెడ్డి వెల్లడించారు. గౌస్ ను అరెస్టు చేయడంలో కీలక పాత్ర వహించిన పోలీస్ సిబ్బందిని అభినందించి రివార్డులు అందజేశారు.

Related Posts