YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

మూడేళ్ళ క్రితం అదృశ్యం అయిన  ఏడేళ్ల పిల్లోడి ఆచూకీ లభ్యం  నిందితుల అరెస్ట్ 

మూడేళ్ళ క్రితం అదృశ్యం అయిన  ఏడేళ్ల పిల్లోడి ఆచూకీ లభ్యం  నిందితుల అరెస్ట్ 

మూడేళ్ళ క్రితం అదృశ్యం అయిన  ఏడేళ్ల పిల్లోడి ఆచూకీ లభ్యం 
నిందితుల అరెస్ట్ 
కామారెడ్డి మార్చ్ 22
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని చిన్న కసాబ్ గల్లి నుండి గత మూడు సంవత్సరాల క్రితం అదృశ్యమైన గణేష్(7) సంవత్సరాల  బాలుడిని హైదరాబాద్ లో పట్టుకుని కామారెడ్డి కి తీసుకురావడం జరిగిందని జిల్లా ఎస్పీ శ్వేత రెడ్డి వెల్లడించారు.  ఎస్పీ విలేఖరులతో మాట్లాడుతూ, జిల్లా కేంద్రానికి చెందిన షేక్ నజీర్, అతని భార్య యాస్మిన్, షబానా బేగం లు బాలుణ్ణి కిడ్నాప్ చేసి హైదరాబాద్ లోని మహమ్మద్ యూసఫ్ జైబున్ని లకు విక్రయించారని చెప్పారు. నజీర్ 2018 లో సైతం కిడ్నాప్ ప్రయత్నం కేసులో జైలుకు వెళ్లాడని, నజీర్ శనివారం  జిల్లా కేంద్రంలో అనుమానాస్పదంగా సంచరిస్తుండగా పట్టుకుని విచారించగా నేరం అంగీకరించినట్టు ఎస్పీ వెల్లడించారు. నిందితులు షేక్ నజీర్, యాస్మిన్, షబానా బేగం లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్పీ శ్వేత తెలిపారు. కిడ్నప్ కు గురి అయిన పిల్లోడిని వారి తల్లి తండ్రులకు అప్పగించమన్నారు. విలేఖరుల సమావేశంలో సీఐ. మధుసూదన్ తదితరులు ఉన్నారు.

Related Posts