విజయవాడ
భారత్ బంద్లో భాగంగా కృష్ణా జిల్లా గొల్లపూడిలో టీడీపీ ఆందోళన చేపట్టింది. భారత్ బంద్ కార్యక్రమం లో పాల్గొన్న మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, తేదేపా నేతలు పాల్గొని కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు.రాష్ట్ర వ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగుతోంది.వాణిజ్య, వర్తక సంఘాలు స్వచ్ఛంధంగా బంద్కు మద్దతు తెలిపాయి.స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, పెట్రోల్ డీజిల్ ధరల పెంపుకు నిరసనగా, వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలంటూ డిమాం డ్ చేశారు.విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు.రైతు వ్యతిరేక మూడు చట్టాలు, విశాఖ ఉక్కు ప్రైయివేటీకరణ వ్యతిరేకిస్తూ భారత్ బంద్ కొనసాగుతోంది.