భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం లో కేంద్ర ప్రభుత్వ నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ ఢిల్లీలో రైతులు చేస్తున్న దీక్షలు నాలుగు నెలలు పూర్తయిన సందర్భంగా శుక్రవారం భారత్ బంద్ కు పిలుపునివ్వడంతో కొత్తగూడెం బస్ డిపో ముందు ఆర్టీసీ బస్సులను వామపక్ష ప్రజా సంఘాల నాయకులు,కార్యకర్తలు అడ్డున్నారు. ఈ సందర్భంగా వామపక్ష పార్టీల నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని గత నాలుగు నెలలుగా నిద్రాహారాలు మాని ఢిల్లీ వీధుల్లో రైతులు గగ్గోలు పెడుతున్న గాని ప్రధాని నరేంద్ర మోడీ చెల్లించకపోవడం బాధాకరం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రజా రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.