YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

ఆర్మీ ఆస్పత్రిలో కోవింద్

ఆర్మీ ఆస్పత్రిలో కోవింద్

న్యూఢిల్లీ, మార్చి 26, 
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శుక్రవారం ఉదయం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు ఛాతీలో నొప్పిగా అనిపించడంతో వెంటనే చికిత్స కోసం ఢిల్లీలో ఆర్మీ రిసెర్చ్ ఆస్పత్రికి వెళ్లారు. రాష్ట్రపతి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అక్కడ వైద్యులు తెలిపారు. రాష్ట్రపతి ప్రస్తుతం అబ్జర్వేషన్‌లో ఉన్నట్లు ఆర్మీ ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించినట్టు వైద్యులు వివరించారు. కోవింద్ ఆరోగ్య పరిస్థితి గురించి బులిటెన్ విడుదల చేశారు.ఇటీవల కరోనా వ్యాక్సిన్‌ను రాష్ట్రపతి వేయించుకున్న విషయం తెలిసిందే. దేశంలో రెండో దశ టీకా పంపిణీ ప్రారంభమైన తర్వాత మార్చి 3న ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో రామ్‌నాథ్‌ కోవింద్‌ వ్యాక్సిన్‌ తొలి డోసు వేయించుకున్నారు. మార్చి 8న ఆయన సతీమణి, ప్రథమ మహిళ సవితా కోవింద్‌ కూడా టీకా తీసుకున్నారు.

Related Posts