YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

మండలి ఛైర్మన్ గా వాణీదేవి ?

మండలి ఛైర్మన్ గా వాణీదేవి ?

హైదరాబాద్, మార్చి 27, 
ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్ని సందర్భాల్లో బయటివారికి అంతుచిక్కని విధంగా నిర్ణయాలు తీసుకొని ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. ఈమధ్యే హైదరాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వాణీ దేవి పేరును ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఎట్టకేలకు ఆమెను గెలిపించుకొని బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేయగలిగారు. అయితే, తాజాగా ఇప్పుడు మరో ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. వాణి దేవికి ఎమ్మెల్సీ పదవి కాకుండా మరింత ఉన్నత పదవి ఇవ్వాలని సీఎం అనుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. శాసన మండలి సభ్యురాలి పదవి ఆమెకు చిన్నది అవుతుందని భావించిన కేసీఆర్ మరో ముఖ్యమైన స్థానం ఇవ్వాలని భావించినట్లుగా టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.సురభి వాణీ దేవిని మండలి చైర్మన్‌గా చేయాలని కేసీఆర్ నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. వాణీదేవిని మండలి పెద్ద కుర్చీలో కూర్చోబెట్టాలనే తొందరలో కేసీఆర్ ఉన్నట్లు గులాబీ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఇందుకు ముహూర్తం కూడా ఖరారు అయినట్లు సమాచారం. ఎందుకంటే ప్రస్తుత మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి పదవీ కాలం జూన్‌లో ముగియనుంది.ఇప్పటికే ఆమె తండ్రి, మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని కేంద్రానికి సీఎం సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. పీవీ కుమారుడు ప్రభాకర్‌రావుకు కూడా ముఖ్యమైన పదవి ఇచ్చే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. పీవీ జయంతి ఉత్సవాలను పెద్ద జరిపిస్తున్నట్లు సీఎం ప్రకటించగానే.. కాంగ్రెస్ ప్రధానిగా పీవీకి ఉన్న పేరును, ప్రజల్లో ఆయనకు ఉన్న అభిమానాన్ని తన ఖాతాలో వేసుకునే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు విశ్లేషణలు వచ్చాయి.

Related Posts