YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

సర్వే దారెటు..

సర్వే దారెటు..

హైదరాబాద్, మార్చి 27, 
కాంగ్రెస్‌ పార్టీలో ఆయన సీనియర్‌ నేత. కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఓ రేంజ్‌లో హవా చాటారు. ఇప్పుడు ఎందుకో సైలెంట్‌ అయ్యారు. మధ్యలో వేరేపార్టీ వాళ్లు వచ్చి పలకరించినా.. ఆ మేరకు చప్పుడు లేదు. ఇంతకీ ఆయన దారెటు? సర్వే సత్యనారాయణ. కాంగ్రెస్‌లో ఆయనకంటూ ప్రత్యేక స్థానం ఉండేది. ఈ మధ్య ఎందుకో పెద్దగా యాక్టివ్‌గా లేరు. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే తానే ముఖ్యమంత్రి అభ్యర్థిని అని గతంలో ప్రకటించిన నాయకుడు.. ఈ మధ్య జరిగిన ఏ ఎన్నికల్లోనూ కనిపించలేదు. ప్రచారంలో సర్వే మాటే లేదు. మధ్యలో ఆయన కండువా మార్చేస్తున్నారని చర్చ జరిగింది. కానీ.. అలాంటి చర్చలకు స్పందించకుండా మౌనంగా ఉండిపోయారు. దాంతో సర్వే ఎందుకు సైలెంట్‌ అయ్యారు? ఆయన భవిష్యత్‌ కార్యాచరణ ఏంటి? అని కాంగ్రెస్‌లో చర్చ  జరుగుతోంది. ఆయన అల్లుడు మాత్రం టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకొని కారులో రయ్‌మని తిరుగుతున్నారు. GHMC ఎన్నికల సమయంలో సర్వేతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, మాజీ ఎంపీ వివేక్‌ తదితరులు సమావేశమయ్యారు. బీజేపీలోకి రావాలని ఆహ్వానించారు. అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోలేకపోయినా.. ఆలోచిస్తాను అని చెప్పి దాటవేశారు. కాకపోతే లోకల్‌ లీడర్లతోపాటు సెంట్రల్‌ బీజేపీ లీడర్స్‌ తనతో టచ్‌లో ఉన్నారని.. కొన్ని ముఖ్యమైన అంశాలపై క్లారిటీ కోసం ఎదురు చూస్తున్నట్టు కమలానికి పాజిటివ్‌ సిగ్నల్స్‌ ఇచ్చారు. అయితే కాంగ్రెస్‌లో కొనసాగలేక.. బీజేపీలో చేరే విషయంలో క్లారిటీ రాక అక్కడే ఆగిపోయినట్టు చెవులు కొరుక్కుంటున్నారు. సర్వే సత్యనారాయణ గతంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా, రెండుసార్లు మల్కాజ్‌గిరి ఎంపీగా, కేంద్రమంత్రిగా పనిచేశారు. కంటోన్మెంట్‌ బోర్డు సమావేశాలను కనుసైగలతో శాసించేవారు. అలాంటి సర్వే.. కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసినా గెలవలేదు. కాంగ్రెస్‌లో రాజకీయాలు కుళ్లూ కుతంత్రాలతో నిండిపోయాయని చెబుతూ పార్టీ వైపు వెళ్లడం మానేశారట. అలా అయితే కాషాయ కండువా కప్పేసుకోవచ్చు కదా అంటే.. ఏ నిర్ణయం తీసుకోరు. కాంగ్రెస్‌లో పెద్ద పదవులు అనుభవించిన తరుణంలో.. బీజేపీలో కూడా ఆ స్థాయిలో పదవి ఇస్తే బాగుండు అని అనుకుంటున్నారట సర్వే. ఆ మధ్య జరిగిన ఎన్నికల్లో బీజేపీ నేతలతో కలిసి వెళ్లి ఓటు వేసి వచ్చారు. ఆనాడు ఆయన్ని అనుసరించిన బీజేపీ నేతల్లో ఒకరు ఆయన ప్రియ శిష్యుడు.. ఇంకొకరు కార్పొరేటర్‌. ఇవన్నీ చూసిన వారు ఆయన అడుగులు కమలం శిబిరంవైపే పడుతున్నట్టు చెవులు కొరుక్కుంటున్నారు. అయితే.. అమ్మ కరుణించి తెలంగాణ కాంగ్రెస్‌ పగ్గాలిస్తే  ఏలేందుకు కూడా  సర్వే సిద్ధంగా ఉన్నారట. దాంతో సర్వే దారెటు అని అంతా చర్చించుకుంటున్నారు.

Related Posts