విశాఖపట్నం మార్చి 27,
విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తర పీఠాధిపతులు స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి చేపట్టిన హిందూ ధర్మ ప్రచార యాత్ర విశాఖ ఏజెన్సీలోని పాడేరు ప్రాంతానికి చేరుకుంది. హుకుంపేట మండలం ఉక్కుర్భ గ్రామంలో భీమలింగేశ్వరస్వామి ఆలయాన్ని స్వామీజీ సందర్శించారు. అలాగే అడ్డుమండ శివాలయానికి కూడా వెళ్లారు. పాడేరు, హుకుంపేట ప్రాంత ఆదివాసీలు స్వాత్నానందేంద్ర సరస్వతీ స్వామికి సాంప్రదాయ పూర్వకంగా స్వాగతం పలికారు. హిందూ ధర్మ ప్రచారయాత్రకు హారతులు పట్టారు