YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

విజయసాయి రెడ్డి మనవరాలి బర్తడేపై సెటైర్లు

విజయసాయి రెడ్డి మనవరాలి బర్తడేపై సెటైర్లు

హైదరాబాద్, మార్చి 27, 
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మనవరాలు(ఆయన కూతురు బిడ్డ, అరబిందో ఫార్మా అధినేత కుమారుడి కూతురు) పుట్టిన రోజు వేడుక శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సుమారు 1500 మంది వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరైనట్లు సమాచారం. రాష్ట్రంలో సెకండ్‌ వేవ్‌ ప్రకంపనలు ఆందోళన కలిగిస్తున్న వేళ ఫలక్‌నుమా తాజ్‌ ప్యాలెస్‌లో జరిగిన ఈ భారీ కార్యక్రమం తీవ్ర చర్చనీయాంశమైంది.కరోనా కట్టడికి ముందస్తు చర్యలు తీసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహించొద్దని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన గంటల వ్యవధిలోనే కోవిడ్‌ నిబంధనలు ఉల్లంఘిస్తూ నిర్వహిస్తూ ఈ బర్త్‌డే పార్టీ నిర్వహించడం గమనార్హం. దీంతో నిబంధనలు సామాన్యులకే వర్తిస్తాయా? ప్రముఖులకు వర్తించవా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఫలక్‌నుమా తాజ్ ప్యాలెస్ అరబిందో ఫార్మా తరఫున బుక్ చేసినట్లు తెలుస్తోంది.

Related Posts