హైదరాబాద్ ; నీతి,ధర్మం,నిజాయితి తో వ్యవహరించే వారికి ఏలాంటి హాని జరుగదని శ్రీశ్రీశ్రీ జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహా ప్రస్తాన పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ మాటాడి నావోదండ విద్యా శంకర భారతి మహా స్వామి అన్నారు.నగరంలోని బేగంపేట లోని పుష్పగిరి మహా స్తానానికి చెందిన స్వామి నేడు గుర్రంగూడ లోని శ్రీ బ్రమ్మా మానస మందిరాన్ని సందర్శించారు.అనంతరం భక్తులనుద్దేశించి అనుగ్రహ బాషణ చేసారు.ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు కరోన వల్ల బయపడుతున్నారని త్వరలో దాని నుండి ఉపశమనం లభించగలదన్నారు.ఈ ఉపద్రవం ఈ నెల చివరి నాటికి శాంతింస్తుదని చెప్పారు.ప్రభుత్వం చేసిన సూచనలను పాటించాలని స్వామిజి సూచించారు.ధర్మం తో నడిచే వారికి భగవంతుడు ఏలాంటి హని తలపెట్టారన్నారు. ప్రస్తుత కాలం కూడా సరిగా లేక పోవడం ఎండాకాలం లో వర్షాలు, విషపు జల్లులు కురిపించడం వల్ల ఇలాంటి ఉపద్రవం వ్యాధులు సంవిస్తున్నాయన్నారు. ప్రజలువీటి నుండి కాపాగుకోవలంటే ధర్మ రక్షణ తో పాటు తగు జాగ్రతలు తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమం లో ధర్మకర్త గంప రంగయ్య గుప్త, ప్రధాన కార్యదర్శి లోక రక్షక గుప్తా ఆలయ ధర్మకర్తలు పద్మావతి,మారుతి రాఘవ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.