హైదరాబాద్
మంత్రి ఈటల రాజేందర్ పై వస్తున్న భూకబ్జా ఆరోపణలతోపాటు మంత్రి కేటీఆర్ మరో మంత్రి మల్లారెడ్డితోపాటు ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి మంచిరెడ్డి మహిపాల్ రెడ్డిలపై గతంలో వచ్చిన ఆరోపణలపై కూడా విచారణ చేయాలని టీజేఎస్ అధినేత కోదండరాం డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడినందుకే విచారణ చేస్తున్నారని కోదండరాం మండిపడ్డారు. ప్రత్యర్థులను లొంగదీసుకునేందుకే భూవివాదాలు హఫీజ్ పేట్ మియాపూర్ భూములపై విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.