హైదరాబాద్
బీజేపీ సీనియర్ నేత విజయశాంతి ముఖ్యమంత్రి కేసీఆర్పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వైద్య ఆరోగ్య శాఖ సీఎం కేసీఆర్ చేతుల్లోకి వెళ్లిందని, ఈ పరిణామంతో రాష్ట్ర ప్రజలు మరింత భయపడిపోయే పరిస్థితి కనిపిస్తోందని విమర్శించారు. అసలు దర్శనం దొరకడమే కష్టంగా మారిన పరిస్థితుల్లో వైద్య శాఖ లాంటి కీలక శాఖ సీఎం కేసీఆర్ చేతుల్లోకి వెళ్లిందని ఎద్దేవా చేశారు. మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అత్యున్నత స్థాయి అధికారులకు సైతం కేసీఆర్ అందుబాటులో ఉండరని, అలాంటి వారి చేతుల్లోకి ఆరోగ్య శాఖ వెళ్లడం ప్రజల్ని కలవరానికి గురి చేస్తోందని విజయశాంతి సెటైర్ వేశారు.