YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కరోనా ఇళ్లకు సీళ్లు

కరోనా ఇళ్లకు సీళ్లు

బెంగళూరు
కర్ణాటకలో కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకీ కరోనా కేసులు తీవ్ర స్థాయిలో పెరిగిపోతు న్నాయి. కరోనా కట్టడికి ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టినప్పటికీ కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నాయి. దింతో రాష్ట్రంలో ఆందోళన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రజలను ఎక్కువ సంఖ్యలో గుమిగూడకుండా ఉండేలా ఆంక్షలు విధించాయి.అయితే కర్ణాటకలో కరోనా విజృంభించి ప్రాంతంలో శానిటైజేషన్ ప్రక్రియ కూడా కొనసాగుతోంది. మండ్యలో కెఆర్ పేట్ పట్టణంలోని జయనగర్ భవనంలో 12 మందికి కరోనా వైరస్ రావటంతో ఇంటికి మునిసిపల్ హెల్త్ డిపార్ట్మెంట్ సిబ్బందిని సీలు చేశారు. కృష్ణరాజపేట మునిసిపాలిటీలోని జయనగర్ ప్రాం తంలోని ఆరు ఇళ్లను సతీష్ కుమార్ మున్సిపల్ అధికారులు నేతృత్వం లోని మున్సిపల్ సిబ్బంది 12 మందికి కరోనావైరస్ ఉన్నట్లు  నిర్ధారించడంతో .. ఆరు ఇళ్లను అధికారులు సీల్ వేశారు. ఒంటరిగా ఉన్న వారు ఇంట్లోనే ఉండి వైద్య చికిత్స తీసుకో వాలని అధికారులు సూచించారు.

Related Posts