విశాఖపట్నం
అరకు వేలి మండలం బస్కి పంచాయతీ గోందన పివిటిజి మహిళా గర్భిణి సుమారు 2 కిలో మీటర్లు దూరం నడిచింది. బస్కి మెయిన్ రోడ్ లో వచ్చి డెలివరి కోసం హాస్పిటల్ లో అతికష్టంమీద చెరింది. . ఈ గ్రామంలో 108 ఇతర వాహనాలు వెళ్ళడానికి అవకాశం లేదు, ఇటువంటి సమయంలో వైద్యం కోసం మాడగడ పి.హెచ్.సి లేదా అరకు వేలి సి. హెచ్. సి లో వైద్యం పొందాలంటే చాలా కష్టంగా ఉంటుంది .ప్రభుత్వం పథకాల పేరుతో ఆదివాసులకు తరతరాలుగా మోసం చేస్తుంగి. గిరిజన ప్రాంతంలో బస్కి పంచాయితీకి మౌలిక సదుపాయాలు కల్పించడంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తుంది. ఇప్పటికైనా పంచాయితీలో దుంగ్యపుట్ గోందన బిజ్జగుడ పిరిపొదోర్ కొంత్రాయిగుడ గ్రామాలకు సమగ్రంగా పూర్తిస్థాయిలో రహదారి సౌకర్యం కల్పించాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు.