తిరుపతి, మే 12,
ఈటెల పార్టీ పెడుతున్నారా.. ఇంకా ఫుల్ క్లారిటీ లేదు కదా. అప్పుడే పనులు మొదలెట్టడం ఏంటి అనుకోవచ్చు. కానీ.. అన్నీ బయటికి చెబుతారా ఏంటి. షర్మిల మాత్రం చెప్పారా. ఎవరు చెప్పారు మీకు.. ఎవరు చెప్పారు మీకు. నేను పార్టీ పెడతానని చెప్పానా.. మీ పాటికి మీరే ఊహించుకుంటారా అన్నారు. ఫైనల్ గా పార్టీ అన్నారు. ఇప్పుడు ఈటెల రాజేందర్ కూడా అంతే నాన బెడుతున్నారు. ఏ లీడరూ ఆయన్ని నేరుగా కలవడం లేదు. పార్టీల ఎవ్వారాలు మాట్లాడ్డం లేదు.
కానీ.. గతంలో టీఆర్ఎస్ లో పని చేసిన మాజీ ఎంపీ.. కొండా విశ్వేశ్వర రెడ్డి మాజీ మంత్రి ఈటెలను మీట్ అయ్యారు. ఈటెల ఎటు స్టెప్ వేయబోతున్నారు.. పార్టీ పెట్టబోతున్నారా లేదా అన్న కన్ ఫ్యూజన్ అలాగే ఉన్న టైంలో.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి మీట్ తో జనాలకి చాలా క్లారిటీస్ వచ్చాయి. కొండా గురించి తెలిసిందే కదా. తను ఎప్పుడు కొత్త పార్టీ స్టార్ట్ చేయాలా అని చూస్తున్నారు. తనే హెడ్డుగా ఉంటారా అనేది వదిలేస్తే.. అందరం కలిసి పార్టీ పెడదాం అనేది కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆలోచన. ముందు నుంచే చెబుతున్నారు కదా. టీఆర్ఎస్ వ్యతిరేకంగా ఉన్న వారిని.. కేసీఆర్ ని వ్యతిరేకించిన వారిని ఒక్కటి చేస్తా అని ఎప్పటి నుంచో అంటున్నారు.ఇదే లిస్ట్ లో కొండాతో పాటు.. రేవంత్ రెడ్డి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. రేవంత్ కొండా కలిసి పార్టీ పెడతారు అని విన్నాం. అలాగే ఈటెల కూడా కలిసి టీమ్ అప్ అవుతున్నారు అనే టాక్ బయటికి వచ్చింది. అదే టైంలో.. ఈటెల పై కేసీఆర్ అటాక్ చేశారు. ఇక కొండా మాత్రం వెనక్కి ఎందుకు తగ్గుతారు చెప్పండి. ఈటెలతో మీట్ అయ్యారు. చూస్తుంటే అనుకున్నట్లే అంతా ప్లాన్ ప్రకారం రన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురూ కలిసి.. టీమ్ అప్ అవుతున్నట్లే ఉంది. అలాగే.. ఈటెలతో పాటు.. ఎన్నికల టైంకి హరీశ్ రావు కూడా ఈ టీమ్ తో కలుస్తారు అనే టాక్ ఉంది. ఎవ్వారం సైలెంట్ గా నడుస్తున్నా.. పార్టీ పనులు మాత్రం స్పీడ్ గానే ఉన్నయ్ అనే టాక్ అయితే ఉంది.