మచిలీపట్నం
కర్ఫ్యూ సమయంలో బయటకి వచ్చిన వ్యక్తులకు డిఎస్పీ రమేష్ రెడ్డి కౌన్సెలింగ్ ఇచ్చారు. బయటికి వస్తే ఎటువంటి విపత్కర పరిస్థితులు వస్తాయి అన్న విషయాన్ని వారికి సర్వ మత గ్రంథాలలో ఉన్నటువంటి సూక్తులతో వివరించారు.దేశ సేవ అంటే బోర్డర్లో తుపాకీలతో యుద్ధం చేయడం కాదు ప్రస్తుత పరిస్థితుల్లో ఇంట్లో కూర్చుని బయటకు రాకుండా ఉండటం కూడా దేశసేవ అని తెలిపారు. ఎవరు కూడా దయచేసి రోడ్లపైకి రావద్దు అని పదే పదే విజ్ఞప్తి చేసినా పట్టనట్లు ఉండడం మంచిది కాదన్నారు.ఎవరికివారు స్వీయ నియంత్రణ పాటించాలని మీకోసం మేము ఉన్నామంటూ భరోసా ఇచ్చారు.