హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 10 నుండి ప్రారంభమైన లాక్ డౌన్. కూకట్ పల్లి జేఎన్టీయూ వద్ద పరిస్థితి ని స్వయంగా తనిఖీ చేసిన సైబరాబాద్ సిపి సజ్జనార్.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు అందరు లాక్ డౌన్ సందర్భంగా తమకి సహకరిస్తున్నారు. అత్యవసరంగా వెళ్లే వారు మాత్రమే రోడ్డుపై ఉన్నారు. మొదటిగా పెట్టిన లాక్ డౌన్ లో అనవసరంగా తిరిగే వారు ఎక్కువగా ఉన్నారు,కానీ ఇప్పుడు ప్రజలకు అవగాహన వచ్చిందని తెలిపారు.ప్రతి ఒక్కరి సహకారం ఉంటేనే ఈ సెకండ్ వేవ్ నుండి బయటి వస్తాం అని పేర్కొన్నారు.లాక్ డౌన్ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా రోడ్లు పైకి వస్తే వారిపై న డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, ఐపిసి సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తామని సిపి సజ్జనార్ హెచ్చరించారు.