నిర్మల్
కరోనాను కట్టడి చేయడంలో వైద్యులతోపాటు నర్సులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. కరోనా వైరస్ ను ఎదుర్కొనే విషయంలో నర్సులు ముందంజలో ఉంటూ గొప్ప సంకల్పాన్ని చూపిస్తున్నారన్నారన్నారని వారి సేవలను కొనియాడారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ రేయింబవళ్లు రోగులను కంటికి రెప్పలా కాపాడుతూ, వారి బాగోగులు చూస్తున్న నర్సులకు ప్రపంచ నర్సుల దినోత్సవం సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.