YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో కరోనా రాజకీయం మంత్రి కొడాలిపై కేసు

ఏపీలో కరోనా రాజకీయం మంత్రి కొడాలిపై కేసు

విజయవాడ, మే 12, 
ఏపీలో కరోనా రాజకీయం నడుస్తోంది. ఎన్‌440కే వేరియంట్‌ కొవిడ్‌–19 వైరస్‌ వ్యవహారంపై టీడీపీ-వైఎస్సార్‌సీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. చంద్రబాబుపై కర్నూలు, గుంటూరు జిల్లాల్లో కేసులు నమోదుకాగా.. కౌంటర్‌‌గా తెలుగు తమ్ముళ్లు మంత్రి సీదిరి అప్పలనాయుడుపై కర్నూలు జిల్లాలోనే ఫిర్యాదులు ఇచ్చారు. మంత్రి అప్పలరాజు కూడా ఎన్‌440కే వేరియంట్‌పై కామెంట్స్ చేశారని గుర్తు చేశారు. తాజాగా ఈ వ్యవహారంపై మంత్రి కొడాలి నానికి తెలుగు తమ్ముళ్లు షాకిచ్చారు.చిత్తూరు జిల్లా కందులవారిపల్లె సర్పంచ్, ఉపసర్పంచ్‌లు చంద్రగిరి పోలీస్ స్టేషన్‌లో నానిపై ఫిర్యాదు చేశారు. నారావారిపల్లెల్లో సీబీఎన్-420 పుట్టిందంటూ ఈనెల 8న మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలు చేశారని.. మాజీ ముఖ్యముఖ్యమంత్రిపై, నారావారిపల్లెపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కొడాలి వ్యాఖ్యలు చంద్రబాబుతోపాటు నారావారిపల్లెను అవమానించేవిధంగా ఉన్నాయని ఆవేదన కలిగించాయన్నారు. మంత్రి వ్యాఖ్యలు తమ మనోభావాలను దెబ్బతీశాయని.. కొడాలిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని ఫిర్యాదులో నేతలు పేర్కొన్నారు.కరోనా వైరస్ వేరియంట్ ఎన్-440కే వైరస్ కర్నూలు పుట్టిందంటూ చంద్రబాబు చేసిన కామెంట్స్‌కు ఈనెల 8న కొడాలి నాని కౌంటర్‌ ఇచ్చారు. కరోనా లాంటి వైరస్ ఏమైనా పుడితే గిడితే.. చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో పుట్టిందన్నారు. దాని పేరు నారా కరోనా.. సీబీఎన్ 420 అన్నారు. 70 ఏళ్ళ క్రితమే అక్కడ పుట్టి.. రాష్ట్రాన్ని నాశనం చేయటానికి నారా 420 వైరస్ పనిచేస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి, చంద్రబాబుకు వేయాల్సింది కరోనా వ్యాక్సిన్ కాదు.. రాబిస్ వ్యాక్సిన్ వేయించాలని హాట్ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపైనే టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Related Posts