YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

కరోనా ధర్డ్ వేవ్... పిల్లలపై ప్రభావం

కరోనా ధర్డ్ వేవ్... పిల్లలపై ప్రభావం

న్యూఢిల్లీ, మే 12, 
రోనా వైరస్ నిజంగా ఎంతోమందిని ఇబ్బందులకు గురిచేస్తోంది. పెద్దల నుండి పిల్లల వరకు అనేక మంది కరోనా బారిన పడుతున్నారు. నిజంగా ఇటువంటి సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అవసరమైన జాగ్రత్తలు పాటించి ఈ వైరస్ బారిన పడకుండా ఉండాలి. ముఖ్యంగా మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం వంటి కనీస జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.అదే విధంగా రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి పోషకాహారం తీసుకోవడం లాంటివి కూడా చేయాలి. వీలైనంత వరకూ ఇంటి పట్టునే ఉండి సురక్షితంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. కరోనా వైరస్ నుండి బయట పడటానికి అనేక వ్యాక్సిన్స్ తయారు చేసిన సంగతి తెలిసిందే.అయితే ఈ రోజు చిన్నపిల్లల్లో అంటే 12 నుండి 15 సంవత్సరాల మధ్య వయసులో ఉండే పిల్లలకి pfizer వ్యాక్సిన్ వల్ల ఎటువంటి ఇబ్బందులు వస్తున్నాయి. దీని వల్ల వాళ్ళకి కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి అనేది ఈరోజు తెలుసుకుందాం. మరి ఆలస్యం ఎందుకు వాటి కోసమే పూర్తిగా చూద్దాం.వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత పెద్దలకు కూడా ఒళ్ళు నొప్పులు, జ్వరం ఇలా వివిధ రకాల సైడ్ఎఫెక్ట్స్ వస్తున్నాయి. పిల్లల్లో కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని ముఖ్యంగా 12 నుండి 15 సంవత్సరాల మధ్య వయస్సు లో ఉండే పిల్లలు వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల కొన్ని లక్షణాలు ఉన్నాయని.... యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ చెప్పింది..ఈ వారంలో అక్కడ పిల్లలకు కూడా టీకాలు వేస్తున్నట్లు వెల్లడించారు. అయితే పెద్దవాళ్లలో వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల కొద్ది పాటి లక్షణాలు మాత్రమే కనబడుతున్నాయి. అదేవిధంగా పిల్లలు వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని అంటున్నారు. మరి ఆ లక్షణాలు ఏమిటి ...?, ఎటువంటి బాధలు పడాల్సి వస్తుంది ...? అనేది కూడా ఇప్పుడు తెలుసుకుందాం. దీని కోసం కూడా ఓ లుక్ వేయండి.కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న ఆ వయసు వాళ్ళు సైడ్ ఎఫెక్ట్స్ గురవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా చేయి మొత్తం నొప్పులు రావడం, జ్వరం, ఇమ్యూన్ సిస్టం వీక్ గా ఉండడం లాంటి సమస్యలు వస్తున్నాయని. ముఖ్యంగా రెండవ డోస్ వేయించుకొని తర్వాత ఈ లక్షణాలు కనబడుతున్నట్లు చెప్పారు.చికాగో డిపార్ట్మెంట్ మెడికల్ డైరెక్టర్ పిల్లల్లో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని ఇవి కొంచెం ఎక్కువగా ఉన్నాయని ఇప్పుడు అక్కడ పిల్లలకి కూడా వ్యాక్సిన్ వేస్తున్నట్లు కొన్ని లక్షణాలు కనబడుతున్నాయి అని వెల్లడించారు.పెద్దల్లో కనిపించే లక్షణాలు పిల్లల్లో కూడా ఉంటున్నాయని ముఖ్యంగా వాక్సినేషన్ వేయించుకున్న వెంటనే పిల్లల్లో ఇబ్బందులు వస్తున్నట్లు చెప్పారు. అయితే ఎటువంటి సీరియస్ లక్షణాలు లేవని చెప్పారు. 16 నుంచి 25 ఏళ్ల మధ్య వాళ్ళలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయో అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ పిల్లల్లో కూడా ఉన్నాయని చిల్డ్రన్ హాస్పిటల్ డాక్టర్ చెప్పడం జరిగింది.ఆడవారికి ఈ సమయంలో ఎక్కువ కోరికలు ఉంటాయట..అలసట, తల నొప్పి రావడం, కొద్దిగా జ్వరం రావడం లాంటి లక్షణాలు 16 నుండి 25 సంవత్సరాల వాళ్ళల్లో చూసాము. అలాంటి లక్షణాలే వీళ్లల్లో కూడా ఉంటాయని అన్నారు అదే విధంగా ఇవి ఎక్కువ సేపు ఉండవని కేవలం ఈ లక్షణాలు రెండు నుండి మూడు రోజులు మాత్రమే ఉంటాయని చెప్పారు.చికాగో టాప్ డాక్టర్ కూడా ఈ విషయమే చెప్పారు. అయితే ప్రాణాంతకమైన సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవని కొద్ది పాటి సైడ్ ఎఫెక్ట్ మాత్రమే ఉన్నాయని వ్యాక్సిన్ చాలా బాగా పని చేస్తోందని .... బ్లడ్ మరియు ప్రొటెక్షన్‌ని చూస్తే ఇది తెలిసింది అని అన్నారు. యాంటీ బాడీస్ వ్యాక్సిన్ ద్వారా మంచిగా ప్రభావితం చేస్తున్నాయని బాగా పని చేస్తోందని చెప్పారు. ముఖ్యంగా ఇతర వయస్కులతో పోల్చి చూస్తే పిల్లల్లో బాగా పని చేస్తున్నట్లు కూడా చెప్పడం జరిగింది.పైగా ఈ వ్యాక్సిన్ చాలా సురక్షితంగా ఉందని 2000 మందికి పైగా 12 ఏళ్ల నుంచి 15 ఏళ్ల వయసు వాళ్ళు వేయించుకున్నారు అని ... ఇప్పటికే చాలా మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు అని చెప్పారు. దీంతో యువత సురక్షితంగా ఉంటారని వ్యాక్సిన్ బాగా పని చేస్తుందని అన్నారు.మిగిలిన వారితో పోల్చుకుంటే పిల్లల్లో చాలా బాగా వాక్సిన్ పనిచేస్తుందని కూడా చాలా మంది చెప్పడం జరిగింది ఇప్పటికే 22 శాతం మంది పిల్లలు కరోనా బారిన పడినట్లు డేటా ద్వారా తెలుస్తోంది. ఇప్పటి దాక 296 మంది పిల్లలు యూఎస్ లో కరోనా కారణంగా మరణించారు. 15 వేల మంది ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు.వ్యాక్సిన్ కారణంగా ఇన్ఫెక్షన్ రేట్ పిల్లల్లో తగ్గుతుందని వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి కరోనా బారిన పడకుండా ఉండడానికి వ్యాక్సిన్ సహాయ పడుతుందని డాక్టర్లు అంటున్నారు. వ్యాక్సిన్ కారణంగా సురక్షితంగా ఉండొచ్చని వ్యాక్సిన్ బాగా ప్రొటెక్ట్ చేస్తుందని డాక్టర్లు అంటున్నారు అదే విధంగా వ్యాక్సిన్‌తో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని, శుభ్రతగా ఉండాలని, రోగ నిరోధక శక్తి పెంచుకోవడం లాంటి కనీస జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు.ఏది ఏమైనా సురక్షితంగా ఉండటానికి వ్యాక్సిన్ తీసుకోవడం చాలా ముఖ్యం. పిల్లలు పెద్దగా ఇబ్బందికరమైన లక్షణాలు కనబడటం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు వ్యాక్సింగ్ చేయించుకోవడం చాలా అవసరం. చాలా మంది వ్యాక్సిన్ మీద అనేక అనవసర సంభాషణలు చేస్తున్నారు. టీకా వెయించుకోవడం వల్ల కరోనా బారిన పడకుండా ఉండడానికి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు.ఇప్పుడు చాలా మందిలో ఏ లక్షణాలు తెలియకుండా కరోనా వైరస్ వస్తోంది. కనుక మరింత జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. జాగ్రత్తలు తీసుకుంటే కరోనా వైరస్ బారిన పడకుండా ఉండటానికి సహాయ పడుతుంది కాబట్టి వీలైనంత వరకూ ఇంటి పట్టునే ఉండడం మంచిది. బయటకు వెళ్ళేటప్పుడు తప్పక సోషల్ డిస్టెన్స్ పాటించడం, మాస్క్ ని ధరించడం, బయటికి వెళ్లి వచ్చిన తర్వాత శానిటైజర్ ఉపయోగించడంలాంటివి చేస్తూ ఉండాలి. లేదు అంటే వైరస్ బారిన పడి పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి.

Related Posts