YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

మహేష్ బాబును వాడేసుకున్నారు

మహేష్ బాబును వాడేసుకున్నారు

హైదరాబాద్, మే 12, 
సైబర్ నేరాలు సహా సామాజిక పరిస్థితులపై నెటిజన్లకు అవగాహన కల్పించడంలో సైబరాబాద్ పోలీసులు ఎప్పుడూ ముందుంటారు. ఇలా అవగాహన కల్పించడం కూడా యువతకు అర్థమయ్యేలా, ఆకట్టుకొనేలా చెప్పడం వారి ప్రత్యేకత. గతంలో ట్విటర్ వేదికగా సినిమా నటీనటులతో మీమ్స్ తరహాలో సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. బ్రహ్మానందంతో రూపొందించిన మీమ్స్ నెటిజన్లను చాలా ఆకట్టుకున్నాయి.తాజాగా కరోనా వేళ మాస్కు ప్రాధాన్యాన్ని చాటేందుకు కూడా పోలీసులు మీమ్స్‌నే ఎంచుకున్నారు. అయితే, ఈ సారి మహేష్ బాబు ఫోటోలతో కావడం విశేషం. దేశ వ్యాప్తంగా ఇప్పుడు కరోనా సెకండ్‌ వేవ్‌ ఎంతలా విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీనిపై అవగాహన కల్పించేందుకు సైబరాబాద్‌ పోలీసులు లేటెస్ట్‌గా మహేష్‌బాబును ఇలా వాడేశారు.డెనిమ్‌ జీన్స్‌, జాకెట్‌ వేసుకున్న మహేష్‌బాబు ఫోటోను షేర్‌ చేసిన సైబరాబాద్‌ పోలీసులు..‘‘డెనిమ్‌ మీద డెనిమ్‌ ఫ్యాషన్‌ ట్రెండ్‌, మాస్క్‌ మీద మాస్క్‌ సేఫ్టీ ట్రెండ్‌’’ అంటూ ఓ ఫోటోను షేర్‌ చేశారు. మహేష్ డెనిమ్‌ జాకెట్‌, డెనిమ్‌ జీన్స్‌ వేసుకొని ఉన్న మహేష్‌ ఫోటోతో ప్రజలకు కోవిడ్‌పై అవగాహన కల్పించారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. విషయం ఏదైనా సరికొత్తగా చెప్పేందుకు ప్రయత్నిస్తారంటూ నెటిజన్లు సైబరాబాద్‌ పోలీసులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కనీసం అభిమాన నటీనటులతో పోలీసులు చేసే ఈ ప్రయత్నాలు ఫలించి జనాల్లో అవగాహన వస్తే బావుటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
 

Related Posts