తిరుపతి, మే 13,
టైం చూసి తప్పించుకుంటారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి.. ప్రజల్ని కాపాడుకోవాలి. ఆ విషయంలో జగన్ ఎంత వరకు చేస్తున్నారు అన్నది అందరికీ తెలిసిందే. ఆయన చేతనైన కాడికి చేస్తున్నారు. వీలు కాని విషయాల్లో ప్రతి పక్షం, ప్రజల నుంచి నానా మాటలూ పడుతున్నారు. అందులో ఎలాంటి మొహమాటమూ లేదు. కానీ.. ఏపీ బీజేపీ లీడర్లు ఏం చేస్తున్నారు అన్నది ఇప్పుడు ఇంట్రస్టింగ్ గా మారింది. వైసీపీ నే కాదు. ఇప్పుడు బీజేపీ బాధ్యత కూడా ఉంటుంది కదా. ఓట్ల కోసమే ప్రజల్లోకి వెళ్తారా బీజేపీ లీడర్లు. ప్రజల్ని పట్టించుకోరా. కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న బీజేపీ లీడర్లు ఏం చేస్తున్నారు. ఏపీ కోసం ఏమైనా చేస్తున్నారా లేదా. తెలంగాణ లాగే మేం కూడా పవర్ చూపిస్తాం అన్నారు కదా బీజేపీ లీడర్లు.. ఇప్పుడేమైంది. అంతేనా. తెలంగాణ నుంచి వచ్చి మరీ.. ఏపీ జనాల్ని ఓట్లు అడిగారు కదా. బైబిల్ కావాలా.. భగవద్గీత కావాలా అంటూ డైలాగులు దంచిన లీడర్లు కూడా ఉన్నారు కదా. వాళ్లంతా ఏమై పోయారు. ప్రజల కోసం అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు కదా. ఇప్పుడేం చేస్తున్నారు అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.ఇక పవనాల్ సార్ ఉన్నారు కదా. బీజేపీ అనగానే.. తుర్రున జనంలోకి వస్తారు కదా. మరి ఇప్పుడు నిలదీయాలి కదా. మరి మేం మీకోసం జనంలోకి వచ్చాం.. జనాన్ని ఓట్లడిగాం.. ఇప్పుడు ఆ జనం కోసం మీరు ఏం చేస్తున్నారు అని ప్రశ్నించాలి కదా. అసలు ప్రశించడానికే పుట్టింది కదా జనసేన. మరి జనం కోసం ఏం చేస్తుంది. పైగా బీజేపీ అంటే ప్రభుత్వంలో ఉంది. జనసేన కాదు కదా. దోస్తు పార్టీ అయిన బీజేపీని నిలదీయాలి. అలాగే ప్రభుత్వంలో ఉన్న వైసీపీని కూడా ప్రశ్నించాలి కదా. ప్రశ్నించడానికే మొదలెట్టిన పవన్ పార్టీ ఇప్పుడు ఏం చేస్తుంది. అధికారంలో ఉన్న బీజేపీ లీడర్లు ఎక్కడ నిద్రపోతున్నారు అంటూ.. పొలిటికల్ గా డిస్కషన్ నడుస్తోంది. అసలు ఈ రెండు పార్టీల గురించి డిస్కషన్ నడుస్తుంది అంటే.. కూడా కాస్త విడ్డూరంగానే ఉంటుంది కదా. కానీ.. జనం మర్చిపోరు కదా. యాడపొయ్యిర్రు సామే అంటూ.. తిట్టుకోవడానికి అయినా.. గుర్తు చేసుకుంటారు కదా.