YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

కోర్టు కార్యకలాలపాలు... లైవ్ కు రెడీ

కోర్టు కార్యకలాలపాలు... లైవ్ కు రెడీ

న్యూఢిల్లీ, మే 13, 
కరోనా పరిస్థితుల నేపథ్యంలో జర్నలిస్ట్‌ల కోసం సర్వోన్నత న్యాయస్థానం ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ ఈ యాప్‌ను గురువారం ప్రారంభించారు. జస్టిస్‌ ఖన్విల్‌కర్‌, జస్టిస్‌ చంద్రచూడ్‌, జస్టిస్‌ ధనుంజయ్‌ల కమిటీ ఈ యాప్‌ను రూపకల్పన చేసినట్లు చీఫ్ జస్టిస్‌ పేర్కొన్నారు. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే సుప్రీంకోర్టు సాంకేతిక బృందం దీన్ని రూపొందించినట్లు జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. సుప్రీంకోర్టు రోజువారీ కార్యకలాపాలను జర్నలిస్టులు ఇకపై ఉన్న చోటు నుంచే రిపోర్ట్‌ చేసేందుకు ఈ అవకాశం కల్పించామని పేర్కొన్నారు.న్యాయస్థానంలో జరిగే కార్యకలాపాలు పారదర్శకంగా ఉండేందుకు సాంకేతికంగా ముందుకెళ్లాలని భావించినట్లు సీజేఐ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత వినియోగంలోకి తీసుకురానున్నట్లు స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు కార్యకలాపాలన్నీ ప్రత్యక్ష ప్రసారాలకు తాను సిద్ధంగా ఉన్నట్లు చీఫ్ జస్టిస్ వెల్ల‌డించారు. ఈ విషయంపై సహ న్యాయమూర్తులతో చర్చించి రాబోయే రోజుల్లో కోర్టు కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం చేసే ప్రయత్నాలు ముమ్మరం చేశామ‌ని వివ‌రించారు.ఒక జర్నలిస్టుగా బస్సులో తిరిగి వార్తలు సేకరించిన రోజులు త‌న‌కు ఇప్పటికీ గుర్తున్నాయని, ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో కోర్టు వార్తల కోసం వారు పడుతున్న బాధలు తమకు తెలుసని వ్యాఖ్యానించారు. మీడియా, సుప్రీంకోర్టు మధ్య అనుసంధానం, వారధిగా వ్యవహరించేందుకు ప్రత్యేక అధికారిని నియమించనున్నట్లు సీజేఐ ప్రకటించారు. అక్రిడిటేషన్ల మంజూరులో ఎవ‌రికీ అన్యాయం జ‌ర‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హామీ ఇచ్చారు.న్యాయస్థానాల్లో కార్యకలాపాలు, విచారణలపై ప్రత్యక్ష ప్రసారం అంశంపై చాలా కాలం నుంచి చర్చ జరుగుతోంది. ప్రత్యక్ష ప్రసారం చేసే అంశం ఇప్పుడు సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. కోర్టు వ్యవహారాల్లో దాపరికం లేకుండా ప్రత్యక్ష ప్రసారం విధానాన్ని అమలు చేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టం చేసింది. కోర్టుల్లో జరిగే వాదనలు, న్యాయమూర్తులు ఇచ్చే తీర్పులను ప్రత్యక్ష ప్రసారం చేయడం వల్ల సమస్యలు వస్తాయని తాము అనుకోవడం లేదని 2018 సెప్టెంబరులో తీర్పు వెలువరించింది.భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎమ్ ఖాన్విల్కర్‌లతో కూడినధర్మాసనం.. కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్టులో జరిగే వ్యవహారాలను ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా న్యాయవ్యవస్థలో జవాబుదారీతనం పెరుగుతుందని అభిప్రాయపడింది. కోర్టులో జరిగే విచారణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా తెలుసుకోవాలనుకోవడం ప్రజల హక్కని.. దీని వల్ల పారదర్శకత కూడా పెరుగుతుందని వ్యాఖ్యానించింది. ప్రత్యక్షప్రసారాల విషయంలో నియమాలు ఉల్లంఘించకూడదంది.అయితే, ఈ విషయంలో గతేడాది అక్టోబరులో అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం.. ‘దుర్వినియోగానికి’ అవకాశం ఉందని వ్యాఖ్యానించింది. గుజరాత్ హైకోర్టు ప్రత్యక్ష ప్రసారం చేసిన మర్నాడే సుప్రీం ధర్మాసనం ఈ సందేహం వ్యక్తం చేసింది. ఈ విధానం దుర్వినియోగం కావచ్చుననే సందేహం వెలిబుచ్చుతూనూ బాబ్డే దీనిపై ఒక నిర్ణయం తీసుకోవసిందేనని అంగీకరించారు. తాజాగా, ప్రస్తుత చీఫ్ జస్టిస్ మరోసారి ప్రత్యక్ష ప్రసారానికి సుముఖత వ్యక్తం చేశారు.

Related Posts