YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

విశాఖ, తూర్పు అనంతలలో డేంజర్

విశాఖ, తూర్పు అనంతలలో డేంజర్

విజయవాడ, మే 13, 
రోనా సెకండ్ వేవ్ తెలుగు రాష్ట్రాలను వణికిస్తోంది. పెరుగుతున్న కేసులు, మందులు, వ్యాక్సిన్ల కొరత, ఆసుపత్రులలో దక్కని బెడ్లు, ఆక్సిజన్ అందక పోతున్న ప్రాణాలు, ప్రైవేట్ ఆసుపత్రుల నిలువు దోపిడీ ఇలా ఒక్కటేమిటి అన్నీ కలిసి ప్రజల ప్రాణాల మీదికి తెస్తున్నాయి. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వాలు కఠినచర్యలు తీసుకుంటున్నా అవి ఎంతవరకు సత్ఫలితాలు ఇస్తాయో తెలియని పరిస్థితి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌‌లో వైరస్ వ్యాప్తి మరింత ఉదృతంగా కనిపిస్తుంది.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాంతాల వారీగా స్థానిక పరిస్థితులను బట్టి చర్యలు తీసుకుంటోంది. అయితే ఇప్పటికే అన్ని జిల్లాల్లోనూ కరోనా వ్యాప్తి అధికంగా ఉంది. ఏ రాష్ట్రంలోనైనా నిర్వహించే పరీక్షలలో పాజిటివిటీ రేటు పదిశాతం దాటితే ప్రమాదకరంగా భావించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కానీ ఏపీలో ఇప్పటికే పాజిటివిటీ రేటు ఇరవై శాతానికి మించిపోయింది.. ఏపీలోని 11 జిల్లాలలో పాజిటివిటీ ఇరవై శాతానికి మించిందని నిర్ధారణ కాగా.. విశాఖ, తూర్పుగోదావరి, అనంతపురం జిల్లాలలో మరింత ఆందోళనకర ప్రమాద పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఆయా జిల్లాల్లో 6-8 వారాల పాటు కఠిన లాక్‌డౌన్ అమలు చేయాలని ఐసీఎంఆర్ సూచిస్తోంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కఠిన ఆంక్షలతో కర్ఫ్యూ అమలు చేస్తున్నా కేసులు సంఖ్య మాత్రం తగ్గడం లేదు.

Related Posts