YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

మన ఆచారాలు..అలవాట్లు..పద్దతులు

మన ఆచారాలు..అలవాట్లు..పద్దతులు

హైదరాబాద్ మే 13 
పూర్వకాలంలో మన ఆరోగ్యం గూర్చి మన పెద్దలు ఎన్నో జాగ్రత్తలు తీసుకునే వారు.కాని నేటి తరం వాటిని చాదస్తంగా ముద నమ్మకాలుగా తీసుకోవడం మూలంగా నేడు అనీక రోగాల బారిన పడుతున్నారు. ముక్యంగా ప్రస్తుతం ప్రపంచాన్ని నిద్రలేకుండా చేస్తున్న కరోన మన పూర్వికులు చిప్పినట్లు పాటిస్తే దరి చేరేది కాదని పలువురు వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. పూర్వకాలంలో ఇంటికి దూరంగా మరుగుదొడ్లు ఎందుకు ఉండేవో... ఇప్పుడు అర్ధం అవుతోంది.  *చెప్పులు ఇంటి బయట విడిచి కాళ్ళు చేతులు ముఖం కడుక్కున్న తరువాతే ఇంట్లోకి ఎందుకు రావాలో...* ఇంటా బయట ప్రతీ గడపకీ పసుపు ఎందుకు రాసేవారో..పసుపు అంటి బయాటిక్ గా పని చేస్తుంది.వారానికి ఒకసారి ఇంట్లో సామానులన్నీ సర్ది ఇల్లంతా ఎందుకు కడిగి సుద్దతో ఇల్లంతా ముగ్గులు ఎందుకు వేసేవారో...*(Calcium నుండి వెలువడే ధాతువులు ఇల్లంతా వ్యాపించి కొన్ని వ్యాధికారక వైరస్ లను నిరోదిస్తాయి)* సుచిగా స్నానం చేసాకే వంట ఎందుకు చేసేవారో....* నోట్లో వేళ్ళు పెట్టుకోవద్దని,  గోళ్లు కొరకొద్దని, ఏదయినా తినేముందు చేతులు కడుక్కోవాలని ఎందుకు చెప్పేవారో... బయట తిరిగి వస్తే మన చేతులకు మలినం కాకుడా బ్యాక్తిరియ అంటుకుని ఉంటుంది .స్నానం చేసాక మడి అని చెప్పి... స్నానం చేయ్యని మిగతా వారిని అంటకుండా ఎందుకు తిరిగేవారో.... మనం బయటకు వెళ్లేముందు ఎవరైనా తుమ్మితే ఆపశకునం అని... కొద్ది క్షణాలు ఆగి వెళ్ళమని ఎందుకు చెప్పేవారో... (ఆ తుమ్మిన వ్యక్తి నోటినుండి ముక్కు నుండి వెలువడిన తుంపరలు కొద్దిసేపు గాలిలో తేలియాడి మెల్లగా నెలమీదకు చేరుకుంటాయి.... ఆ తుంపరల బారినపడి అంటువ్యాధులు రాకుండా వుండాలని ఆలా చెప్పేవారు)* బయటకు వెళ్ళాక తెలిసినవాళ్ళు ఎదురు పడితే (కారాచలనం చేయ్యకుండా) రెండు చేతులు జోడించి నస్కారం ఎందుకు చేసేవారో....* ప్రతీ కూరలోనూ పసుపు ఎందుకు వేసేవారో...* *నెలకి ఒక్కసారి ఐనా మిరియాల చారు, మెంతుల పులుసు తప్పనిసరిగా ఎందుకు చేసేవరో....* కనీసం ఆరు నెలలకి ఒక్కసారి అయినా ఆముదం ఎందుకు పట్టించేవారో....* ఎవరి ఇంట్లో అయినా బిడ్డ పుట్టినా లేక ఎవరైనా చనిపోయినా 11 రోజులు మైల అని ఎందుకు అనేవరో... ఎవాన్ని బ్యాక్రియా కు సంబందించిన విషయాలు ఇంకా ఇటువంటివి చాలా వున్నాయి..*_ఇవన్నీ ఆలోచిస్తుంటే మన పూర్వికులు కూడా కరోనాలాంటి మహమ్మారితో పోరాడి ఇటువంటి నియమాలను ఆచారాలతో మేళవించి అనుసరించారేమో అనిపించక మానదు. *కానీ మనకి ఆధునిక విజ్ఞానం ఎక్కువయ్యి.... కాకరకాయని...కీకరకాయ అనడం మొదలుపెట్టాము.*పెద్దవాళ్ళకి చాదస్తం ఎక్కువ అని వారిని చాందసవాదులుగా ముద్రవేసి వారు చెప్పిన మాటలను గేలిచేసి... గాలికి వదిలేసి ఇంతకాలం ఇష్టనుసారం తిరిగి.... ఇదిగో ఇప్పుడు మనకి తెలియకుండానే అవన్నీ కాకపోయినా అందులో కొన్ని ఆచారిస్తున్నాము. ఏదేని మనదాక వస్తే కాని ఎదుటివారు ఎందుకు చెప్పారో అర్ధమవుతుంది.

Related Posts