YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కాంగ్రెస్ లో ఈటల కలకలం

కాంగ్రెస్ లో ఈటల కలకలం

హైదరాబాద్, మే 17, 
మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారడం ఓ వైపు ఉంటే… మరోవైపు ఈ వ్యవహారం కాంగ్రెస్లో చిచ్చు పెట్టింది. ఒకవైపు కాంగ్రెస్ఎంపీ, టీపీసీసీ చీఫ్ఉత్తమ్, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డితో పాటు చాలా మంది సీనియర్లు ఈటలకు సమర్థింపుగా ఉంటున్నట్లుగా ఉంటూనే భూ కబ్జాలపై ఇతర మంత్రులను టార్గెట్ చేస్తున్నారు. ఈ భూ వ్యవహారంలో ఈటలకు కాంగ్రెస్, బీజేపీ నేతల నుంచి మద్దతు ఉంటోంది. కానీ హుజురాబాద్ కాంగ్రెస్ నేత పాడి కౌశిక్రెడ్డి మాత్రం వ్యతిరేక విమర్శలు సంధిస్తున్నారు. పార్టీతో సంబంధం లేకుండా… పార్టీ వద్దన్నట్లుగా సంకేతాలిచ్చినా ఈటల టార్గెట్గా ఆరోపణలు చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్లో కౌశిక్రెడ్డి వ్యవహారం తలనొప్పిగా మారింది. అంతేకాకుండా ఆయన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డికి సమీప బంధువు కూడా కావడం మరో విశేషం.హుజురాబాద్‌ కాంగ్రెస్‌ నేత, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమీప బంధువు పాడి కౌశిక్‌రెడ్డి రాజకీయం ఏంటో కాంగ్రెస్‌ పార్టీ నాయకులకు అంతుచిక్కడం లేదు. పార్టీల నాయకుల అభిప్రాయానికి భిన్నంగా మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను భూకబ్జాదారుడిగా చూపిస్తూ ఆరోపణలకు దిగుతున్నారు. ఈటల అంశంలో రోజుకో అంశాన్ని ఎత్తిచూపుతూ వివాదంగా మారుతున్నారు. మరోవైపు ఈ వ్యవహారంలో కౌశిక్రెడ్డిపై సొంతపార్టీ నేతలే విమర్శలు చేస్తున్నారు. ఆయన వ్యవహారం సరికాదంటూ మాజీ ఎంపీ, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ టీపీసీసీకి లేఖ రాశారు. దాన్ని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ ఠాగూర్కు కూడా పంపించారు. మరోవైపు ఇటీవల ఈటల రాజేందర్ పలువురు నేతలు, ఉద్యకారులతో భేటీ అవుతున్నారు. రాజ్యసభ ఎంపీ డీఎస్, సీఎల్పీ నేత భట్టి, మాజీ మంత్రి, బీజేపీ నేత చంద్రశేఖర్తో సమావేశమైన విషయం తెలిసిందే. అటు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉత్తమ్, రేవంత్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, వీహెచ్, దాసోజు శ్రవణ్, జీవన్రెడ్డి, బీజేపీ నుంచి కూడా విజయశాంతి, అరవింద్ తదితరులు ఈటలకు మద్దతుగా నిలిచారు. కానీ కాంగ్రెస్ నేతలంతా ఈటల రాజేందర్కు మద్దతు తెలుపుతుంటే.. హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ నేత పాడి కౌశిక్రెడ్డి మాత్రం ఈటలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ముఖ్యనేతలంతా ఓ స్టాండ్ తీసుకుంటే కౌశిక్ రెడ్డి మరో స్టాండ్ తీసుకున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.మరోవైపు టీఆర్ఎస్నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం ఈటల రాజేందర్పై బహిరంగ ఆరోపణలకు ఫుల్ స్టాప్ పెట్టారు. ఇటీవల రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్తో పాటు కొంతమంది మాత్రం ఈటలపై విమర్శలు చేశారు. ఆ తర్వాత వాళ్లు కూడా సైలెంట్ అయిపోయారు. కానీ హుజురాబాద్ కాంగ్రెస్ఇంఛార్జి పాడి కౌశిక్రెడ్డి ఈటలపై ఆరోపణలు ఆపడం లేదు. ప్రెస్మీట్లతో పాటుగా సోషల్ మీడియాలో ఈటలపై విరుచుకుపడుతున్నారు.ఒంటరిగానే ఈటలను టార్గెట్ చేస్తున్న కౌశిక్… తాను టీఆర్ఎస్లోకి వెళ్లనంటూ వెల్లడించారు. ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కౌశిక్రెడ్డి టీఆర్ఎస్ నుంచి పోటీచేసే అవకాశం ఉందని, టీఆర్ఎస్ఆయనకు వెనకుండి సపోర్టు చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. కానీ తన చర్యలకు కట్టుబడి ఉంటానని, తాను టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు సాగుతున్న ప్రచారంలో వాస్తవం లేదంటూ గురువారం ఓ వీడియో విడుదల చేశారు. హుజురాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేస్తానని, అదే సమయంలో ఈటల భూదందాలను వెలుగులోకి తెస్తానని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ నాయకులను, కార్యకర్తలను వేధింపులకు గురిచేసిన ఆయన్ను వదిలే సమస్య లేదంటూ వెల్లడించారు.ఈ వ్యవహారంలో కాంగ్రెస్ అధిష్ఠానం ఎందుకో మౌనంగానే వ్యవహరిస్తోంది. కరీంనగర్ జిల్లా నుంచి కౌశిక్ అంశంలో ఏం చేయడం లేదనే విమర్శలున్నాయి. తాజాగా పొన్నం ప్రభాకర్ కూడా అధిష్టానానికి లేఖ పంపారు. ఉత్తమ్తో పాటుగా ఠాగూర్కు కూడా ఇదే అంశాన్ని సూచించారు. కానీ ఇంకా ఎలాంటి రిప్లై లేదు. కౌశిక్రెడ్డి ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కు దగ్గరి బంధువు కావడం కూడా చర్చకు దారి తీస్తోంది.

Related Posts