నర్సాపురం
ఉదయం ఆరు గంటల నుండి పన్నెండు గంటల వరకు పశ్చిమ గోదావరి జిల్లా నరసా పురం మార్కెట్ జాతరను తలపిస్తు న్నాయి. మార్కెట్లో ఒకరినొకరు రాసుకుంటూ తోసుకుంటూ ఎగబడి కొంటున్నారు. కరోనా మహమ్మారి మూలంగా ప్రజలు పిట్టలు రాలినట్టు రాలిపోతున్న ప్రజల్లో మార్పు రావడం లేదు. ప్రజలు పని ఉన్నా లేకపోయినా ఏదో వంకతో రోడ్డు పైకి రావడం ఇక్కడ కరోనా అంటించుకుని ఇంటికి పోయి అందరికీ తీరిగ్గా అంటిస్తున్నారు. రోజంతా ఇంట్లో కూర్చోలేని ప్రజలకు ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో పోలీసులు ఉన్నారు.