హైదరాబాద్
కరోనా కట్టడి లో రెండు తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా విఫలం అయ్యాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావు విమర్శించారు. ఈటల రాజేందర్, వై ఎస్ ఆర్ సీపీ ఎంపీ రఘురాం పై కాకుండా కరోనా కట్టడికి ప్రభుత్వాలు శ్రద్ధ చూపాలని అయన సూచించారు.
కరోనా కట్టడి చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం అయ్యాయని అయన ఆరోపించారు. మన దేశానికి వాక్సిన్ కొరతకు మోడీ కారణం అని పేర్కొన్నారు. మన దేశంలో తయారైన వాక్సిన్ ను ఇతర దేశాలకు తరలించి మోడీ పెద్దతప్పు చేశారని విఎచ్ తెలిపారు. ఐసోలాషన్ లో ఉండాల్సిన ప్రజలు స్మశాన వాటికలో ఉన్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు, ఫంక్షన్ హాల్స్ అన్ని కోవిడ్ చికిత్స కొరకు ఉపయోగించాలని కోరారు. ఎన్నికల మీద ప్రభుత్వాలకు ఉన్న శ్రద్ధ కోవిడ్ పై లేదన్నారు. ఈటల రాజేందర్, వై ఎస్ ఆర్ సీపీ ఎంపీ రఘురాం పై కాకుండా కరోనా కట్టడికి ప్రభుత్వం శ్రద్ధ చూపాలని సూచించారు .