రంగారెడ్డి
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క హల్ చల్ చేశారు. సీతక్క ఏం చేసినా ప్రజాదరణ పొందుతోంది ఆమె సర్వసాధారణంగా సహజ సిద్ధంగా ఉంటారు. ఏ పని చేసినా అంకిత భావంతో పనిచేస్తారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణానికి వచ్చిన ఎమ్మెల్యే సీతక్క ఎన్ ఎస్ యు ఐ జాతీయ నాయకుడు దినేష్ సాగర్ ఆధ్వర్యంలో రోగులకు ఉచిత భోజన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఈ వంటకాల ఏర్పాట్లను ఎమ్మెల్యే సీతక్క స్వయంగా పరిశీలించారు. తనదైన శైలిలో ఎమ్మెల్యే సీతక్క చేతితో గరిట పట్టి వంటలు గుమగుమలాడేలా చేశారు. సీతక్క స్వయంగా వంట చేస్తుండగా కార్యకర్తలు చప్పట్లతో అభినందించారు..