YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

అనాధ పిల్లలకు అండగా ఉంటాం మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

అనాధ పిల్లలకు అండగా ఉంటాం  మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

నిర్మ‌ల్  
క‌రోనా సోకి త‌ల్లిదండ్రుల‌ను కొల్పోయి అనాధలుగా మారిన పిల్ల‌ల‌కు తెలంగాణ‌ ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంద‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. మంగ‌ళ‌వారం నిర్మ‌ల్ ప‌ట్ట‌ణంలో బాల‌ల సహాయ వాణి వాహనాన్ని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి  ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... సీయం కేసీఆర్ ఆదేశాల మేర‌కు.. కోవిడ్ తో క‌న్న‌వారిని కొల్పోయిన పిల‌ల్ల‌ను చేర‌దీసి సంర‌క్షించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌న్నారు.  కాల్ సెంట‌ర్ కు కాల్ వ‌చ్చిన  24 గంట‌ల్లో  అనాధ పిల్లల‌ను ఈ వ్యాన్ లో జిల్లా బాల‌ల సంర‌క్ష‌ణ‌ కేంద్రానికి త‌ర‌లిస్తార‌ని చెప్పారు. బాలిక‌ల‌ను కేజీవీబీ విద్యాల‌యానికి, బాలుర‌ను భైంసాలోని వివేకానంద స్కూల్ లో చేర్పించి విద్య‌ను అందిస్తామ‌ని పేర్కొన్నారు.  అనాధ పిల్లలు రోడ్డున ప‌డితే సమాజానికి నష్టమని, అటువంటి పిల్లలను చేరదీసి వారికి విద్యాబద్దులు నేర్పిస్తే ఉత్తమ పౌరులను అందించిన వారమవుతామన్నారు.
 

Related Posts