YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తెలంగాణను హడలెత్తిస్తున్న బ్లాక్ ఫంగస్

తెలంగాణను హడలెత్తిస్తున్న బ్లాక్ ఫంగస్

హైదరాబాద్
తెలంగాణను బ్లాక్ ఫంగస్ హడలెత్తిస్తోంది. ఇంతవరకు ఢిల్లీ, అహ్మదాబాద్, మహారాష్ట్రలో మాత్రమే వెలుగుచూసిన ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ కేసులు  ఇప్పుడు తెలంగాణ లో కూడా వెలుగు చూస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా బ్లాక్ ఫంగస్ తో  పది మంది మృతి చెందడంతో అధికారులు, ప్రభుత్వం అప్రమత్తమయ్యాయి. సోమవారం ఒక్కరోజే నిజామాబాద్ జిల్లాకు చెందిన ముగ్గురు, నల్లగొండ జిల్లాకు చెందిన ఒకరు మృతి చెందారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో లో బ్లాక్ ఫంగస్ తో 16 మంది, కోటి ఈఏంన్టీ హాస్పిటల్లో  25 మంది చికిత్స పొందుతున్నారు. మంగళవారం నాడు ఖమ్మంలో జిల్లాలో తాజాగా మరొక బ్లాక్ ఫంగస్ కేసు నమోదయింది.బ్లాక్ ఫంగస్ కు నోడల్ కేంద్రంగా  ఉన్న కోఠి ఈఎన్టీ  లో బెడ్ల సంఖ్యను పెంచే యోచనలో వైద్య ఆరోగ్య శాఖ వున్నట్లు సమాచారం

Related Posts