YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

లేడీ కానిస్టేబుల్..హనీ ట్రాప్

లేడీ కానిస్టేబుల్..హనీ ట్రాప్

హైదాబాద్, మే 18, 
పోలీసు శాఖలో పనిచేస్తున్న ఓ మహిళ పాడు పనులకు శ్రీకారం చుట్టింది. తన అందాన్ని ఎరగా వేసి అమాయక యువకుల జీవితాలతో ఆడుకుంటోంది. పెళ్లి పేరుతో నాటకమాడి అందినంత దోచుకుని ప్లేటు ఫిరాయిస్తోంది. ఈమె వలలో పడి మోసపోయిన ఓ యువకుడు వాట్సాప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కిలేడీ బాగోతాలు బయటపడుతున్నాయి. సంధ్యారాణి అనే మహిళ హైదరాబాద్‌లోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది. డబ్బులున్న యువకులను ట్రాప్ చేసి వారిని ప్రేమపేరుతో వలలో వేసుకుంటోంది. అనంతరం వారిని దొంగ పెళ్లి చేసుకుని ఆస్తినంతా స్వాహా చేసేస్తుంది. సంధ్యారాణికి ఇప్పటికే మూడు పెళ్లిళ్లు అయ్యాయి. 8 సంవత్సరాల పాప కూడా ఉంది. ముగ్గురు భర్తల్లో ఇద్దరికి విడాకులు ఇవ్వగా.. మరొకరు ఈమె వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రానికి చెందిన చరణ్‌తేజ్ అనే యువకుడు హైదరాబాద్‌లో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే అతడికి సంధ్యారాణి పరిచయమైంది. అతడితో మంచిగా మాట్లాడుతూ కొద్దిరోజులకు వలలో వేసుకుంది. ఇద్దరూ కొన్నాళ్ల పాటు చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఈ క్రమంలోనే వెళ్లిన చోటల్లా ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. కొద్దిరోజుల తర్వాత తనను పెళ్లిచేసుకోవాలని, లేకపోతే ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతానని లేడీ కానిస్టేబుల్ చరణ్‌తేజ్‌ను బెదిరించింది. గతంలో తాను చేసుకున్న మూడు పెళ్లిళ్ల విషయం చెప్పడంతో అతడిని నాలుగో పెళ్లి చేసుకుంది.అప్పటినుంచి చరణ్‌కు నరకం మొదలైంది. అతడిని క్రిస్టియన్‌గా కన్వర్ట్ కావాలని వేధించసాగింది. బ్లాక్‌మెయిల్ చేస్తూ అతడి నుంచి రూ.లక్షల్లో డబ్బులు వసూలు చేసింది. తనను వదిలేయాలని అతడు ఎన్నిసార్లు వేడుకున్నా కనికరించకుండా ఓ గదిలో బంధించింది. దీంతో బాధితుడు తనను రక్షించాలంటూ శంషాబాద్ డీసీపీతో స్థానిక పోలీస్‌స్టేషన్‌ ఫోన్ నంబర్లకు వాట్సాప్‌ ద్వారా వేడుకున్నాడు. సంధ్యారాణి తనను ఎలా మోసం చేసింది, ఎన్ని చిత్రహింసలు పెట్టింది చెప్పుకొచ్చాడు. కానిస్టేబుల్ ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకుని అమాయకులను మోసం చేస్తున్న సంధ్యారాణి డిపార్ట్‌మెంట్‌ నుంచి తొలగించడంతో పాటు కఠినంగా శిక్షించాలని బాధితుడు వేడుకున్నాడు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు సంధ్యారాణిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.సంధ్యారాణి ఆగడాలపై బాధితుడి కంటే ముందు ఆమె తల్లిదండ్రులు గతంలో జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కూతురు పోలీసు ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకుని చెడు తిరుగుళ్లు తిరుగుతోందని, తప్పని చెప్పిన తమను బెదిరింపుకు గురిచేస్తోందని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పట్లో ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీన్ని ఆసరాగా తీసుకునే సంధ్యారాణి హనీట్రాప్‌‌ చేసి యువకుల జీవితాలతో ఆడుకుంటోంది.
 

Related Posts